ఖమ్మం: జిల్లా కాంగ్రెస్ ఇంటిపోరు రాజధానికి చేరింది. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, పార్టీలో నెలకొన్న పరిస్థితులపై సోమవారం హైదరాబాద్ గాంధీభవన్లో ఏఐసీసీ నాయకులతో జిల్లా నాయకులు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు మల్లుభట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి, జిల్లాలోని సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఇప్పటికే అటు రేణుకా చౌదరి వర్గీయులకు, ఇతర వర్గీయులకు సమావేశానికి హాజరు కావాలని ఏఐసీసీ నాయకులు సమాచారం అందించడంతో వారి వారి అనుచరులను సమావేశానికి రప్పించుకుని తమ బల నిరూపణ కోసం ఇరు వర్గాల నాయకులు ప్రయత్నం చేస్తున్నారు.
గత వారం రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన పార్టీ మేథోమధన కార్యక్రమానికి జిల్లా నాయకులు హాజరై వారి అభిప్రాయాలను వెల్లడించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించాలని ఏఐసీసీ, టీపీసీసీ నాయకులు జిల్లా నేతలకు సూచించారు. అయితే ఈ సమావేశానికి ముందే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వారిని ఇటీవల జరిగిన మేథోమధన సదస్సుకు ఆహ్వానించడం, వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై రేణుకా చౌదరి వ్యతిరేక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని గమనించిన ఏఐసీసీ నాయకులు పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు కుంతియాను జిల్లాకు పంపించి ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదుర్చాలని భావించారు. అయితే కుంతియా రాకముందే జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా సోమవారం హైదరాబాద్లో సమావేశం నిర్వహించేందుకు ఏఐసీసీ ముహూర్తం నిర్ణయించింది.
పార్టీ పరిస్థితిపై చర్చించేనా..?
జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చించేందుకే ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారా.. అనేది జిల్లాలో చర్చనీయాంశమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలతో రేణుకా చౌదరి వర్గానికి చెందిన 14 మందిని సస్పెండ్ చేసినా, వారిని సైతం మేథోమధన సదస్సుకు ఆహ్వానిం చారు. ఈ పరిస్థితిపై ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్తోపాటు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇది జరిగిన వారం రోజులకే ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఈ పరిస్థితులను గమనించిన ఏఐసీసీ నాయకులు దిగ్విజయ్సింగ్, కుంతియా సోమవారం హైదరాబాద్కు చేరుకుని జిల్లా కాంగ్రెస్ నాయకులతో భేటీకి సిద్ధమయ్యారు. కోరం కనకయ్యతో ప్రారంభమైన వలసల పరంపరకు చెక్ పెట్టడంతోపాటు జిల్లా కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నడిపించేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ వర్గీయులు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే రెండు వర్గాలుగా చీలిన రేణుకా చౌదరి, మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు కలిసి పనిచేసేందుకు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనే చర్చ కొనసాగుతోంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు సోమవారం జరిగే సమావేశం కీలకం కానుంది. ఈ సమావేశంలోనే జిల్లా కాంగ్రెస్ను ఏకతాటిపై నడిపించే నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
రాజధానిలో రగడ
Published Mon, Sep 1 2014 4:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement