సాక్షి, మహబూబ్నగర్: జిల్లాలో మొత్తం 6,500 చెరువులున్నాయి. వాటిలో పెద్ద చెరువులు (వంద ఎకరాల్లో విస్తరించినవి) 681. వీటికింద 1,56,334 ఎకరాలు సాగవుతోంది. ఇక చిన్న చెరువులు 5,819 ఉన్నాయి. వీటికింద 82,722 ఎకరాల పంట సాగవుతోంది. అయితే ఈ చెరువులను 30 ఏళ్లుగా పట్టించుకునే నాధుడు లేకపోవడంతో ఒండ్రు మట్టితో పూడిపోయాయి. వీటికి వరద వచ్చే కాలువలు కూడా మట్టితో నిండుకొని చెరువుల్లోకి నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోయింది. ఈ నేపథ్యంలో మెజార్టీ చెరువులలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉండడం లేదు. దీంతో వాటికింద సాగవ్వాల్సిన ఆయకట్టు నానాటికీ తగ్గుతోంది. ప్రస్తుత ప్రభుత్వం చెరువులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించింది.
దత్తతకు మూడే..!
మిషన్ కాకతీయ కింద చెరువుల పూడికకు సంబంధించి ఎవరైనా దాతలు ముందుకు వస్తే వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్కారు పిలుపు జిల్లాలో స్పందన కరువైంది. ఇప్పటివరకు మూడు చెరువులు దత్తత తీసుకునేందుకు మాత్రం దాతలు ముందుకు వచ్చారు. మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత గ్రామానికి చెందిన పెద్ద చెరువును మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్రెడ్డి దత్తత తీసుకున్నారు. పెద్దచెరువు పరిధిలో ఆయకట్టు 560 ఎకరాల వ్యవసాయ పొలం సాగులో ఉండేది. కొన్ని సంవత్సరాల నుండి చెరువులో పూడిక పెరగడం, వర్షాధారాలు లేని కారణంగా చెరువులో నీటిచుక్క లేకుండా బోసిపోయింది.
దీంతో అమరచింత సమీపంలోని తండాలతోపాటు పాంరెడ్డిపల్లె, కొంకణవానిపల్లె గ్రామాలలో కూడా భూగర్భజల మట్టం పూర్తిగా పడిపోయింది. దీంతో మిషన్ కాకతీయ ద్వారా పూడికతీసి, బీమా ఎత్తిపోతల ద్వారా భూత్పూర్ రిజర్వాయర్ నుండి అమరచింత మీదుగా ఏర్పాటుచేసిన కాలువ ద్వారా సాగునీటిని ప్రకాష్రెడ్డి తపిస్తున్నారు. ఆయన ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసింది. అలాగే ఆమన్గల్ మండలంలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన వేముల చెరువు, వీరన్న చెరువును దత్తత తీసుకునేందుకు ఎన్ఆర్ఐ అర్జున్రావు ముందుకు వచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం రెండు చెరువుల అంచనాలను సిద్ధం చేసింది. వేముల చెరువుకు రూ.45లక్షలు, వీరన్న చెరువుకు 13 లక్షల రూపాయలతో అధికారులు ప్రతిపాదనలు చేసి పంపించారు.
పరుగులు తీస్తున్న మిషన్
మిషన్ కాకతీయ ద్వారా మొదటి విడతలో జిల్లాలో 1,266 చెరువులు ఎంపికయ్యాయి. దీంతో పూడికతో నిండిపోయిన చెరువులు, కుంటల్లోయుద్ధప్రాతిపదికన ఒండ్రుమట్టిని తీయడంతో పాటు వాటికి వచ్చే వరద కాలువలను బాగుపరిచేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో చెరువు స్థాయిని బట్టి రూ.10లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఖరీఫ్ సీజన్కు వీటిని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఈ మేరకు టెండర్లు నిర్వహిస్తున్నారు.
దత్తత జాడేది?
Published Mon, Mar 2 2015 1:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement