'సీమాంధ్ర రాజకీయాలు ఇక్కడ వద్దు' | Sakshi
Sakshi News home page

'సీమాంధ్ర రాజకీయాలు ఇక్కడ వద్దు'

Published Thu, Feb 12 2015 2:59 PM

'సీమాంధ్ర రాజకీయాలు ఇక్కడ వద్దు'

ఆదిలాబాద్: సీమాంధ్ర రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో చేయవద్దని, ఏపీ సీఎం అక్కడి వ్యవహారాలు చూసుకోవటం మేలని ఎంపీ కవిత అన్నారు. ఆమె గురువారం ఆదిలాబాద్ జిల్లా ఆసిపాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆసిఫాబాద్‌లో ఆమె తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు.

(ఆసిఫాబాద్)

Advertisement
Advertisement