కొనసాగుతున్న మాటలయుద్ధం
టీఆర్ఎస్, టీడీపీ శ్రేణుల ఘర్షణ
పాలకుర్తి/దేవరుప్పుల: డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి.. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు మధ్య మాటలయుద్ధం కొనసాగుతోం ది. ఆదివారం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలోని బమ్మె రలో జరిగిన కార్యక్రమంలో ఒకరికొకరు విమర్శలు చేసుకున్నారు. గ్రామంలో రూ. 4 కోట్ల తో నిర్మించనున్న రోడ్ల పనులకు డిప్యూటీ సీఎం కడియం, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎర్రబెల్లి మాట్లాడు తూ.. ‘అభివృద్ధి పనులకు నిధుల మంజూరు లో వివక్ష చూపొద్దని చేతులెత్తి మొక్కుతు న్నా.. నాపై కక్షను ప్రజలపై తీర్చుకోవద్దు.’ అని అన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణాల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు రూ. 30 కోట్ల వరకు మంజూరు చేసిన ప్రభుత్వం... పాలకుర్తికి రూ. 4.50 కోట్లు మాత్రమే ఇచ్చి వివక్ష చూపిందన్నారు.
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనకు వచ్చిన సమయంలో ఆయనను కలిసి పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూ రులో స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. మధ్య లో నిధుల మంజూరును అడ్డుకున్న దొంగలెవరో తేల్చాలన్నారు. ఆ తర్వాత కడియం శ్రీహరి మాట్లాడుతూ నిధుల మంజూరులో వివక్ష లేదన్నారు. ఈ క్రమంలో ఎర్రబెల్లి జోక్యం చేసుకుని నియోజకవర్గానికి సీఆర్ఆర్ గ్రాంటు లో రూ. 4.50 కోట్లు మాత్ర మే వచ్చాయని, మిగిలిన నిధుల మంజూరుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇంతలో టీఆర్ఎస్ నాయకుడు ముత్తినేని సోమేశ్వర్రావు దయాకర్రావును అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తలు వేదిక వైపు దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ కూర సురేందర్, సీఐ తిరుపతి, ఎస్సై ఉస్మాన్ షరీఫ్ పోలీసు బలగాలతో వారిని అడ్డుకున్నారు. సుమారు 20 నిమిషాలు సమ యం ఇరువర్గాలు నినాదాలు చేసుకున్నారు. కడియం విజ్ఞప్తి మేరకు ఇరు పార్టీల కార్యకర్తలను అక్కడి నుంచి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. అరుుతే కడియం వెళ్తుండగా నియోజకవర్గానికి నిధులు అడ్డుకుంది ఆయనేనని దయాకర్రావు అన్నారు.
ఎర్రబెల్లి వర్సెస్ కడియం
Published Mon, May 25 2015 2:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement