కాంగ్రెస్ తప్పుల వల్లే టీఆర్ఎస్కి అధికారం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ తప్పుల వల్లే టీఆర్ఎస్కి అధికారం

Published Fri, Nov 28 2014 11:30 AM

కాంగ్రెస్ తప్పుల వల్లే టీఆర్ఎస్కి అధికారం - Sakshi

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరి పాత్ర ఉందని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. కాంగ్రెస్ తప్పుల వల్లే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని ఆయన శుక్రవారం అసెంబ్లీలో అన్నారు. ఎన్నికల హామీలు విస్మరిస్తే సహించేది లేదని ఎర్రబెల్లి ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఇబ్బందుల్లో ఉందన్నారు. రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని ఎర్రబెల్లి అన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement