Sakshi News home page

రైతు బలవన్మరణం

Published Sat, Sep 26 2015 7:08 PM

Farmer commits suicide

జైనథ్ (ఆదిలాబాద్) : మండలంలోని జామ్ని గ్రామ పంచాయతీ పరిధి జున్నపాని గ్రామానికి చెందిన రైతు మడావి భీంరావ్(32) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ ఏడాది పత్తి, కంది సాగు చేశాడు. పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.50 వేలు, బ్యాంకులో రూ.15 వేలు అప్పు చేశాడు.

అయితే వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు పంట నేలకొరిగింది. దీంతో దిగుబడి వస్తుందో రాదో అన్న దిగులుతో శుక్రవారం సాయంత్రం చేనులోనే పురుగుల మందు తాగాడు. ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతూ రాత్రి చనిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement