రైల్వే శాఖలో పనిచేస్తున్న గేట్మెన్లు భయంగుప్పిట్లో విధులు నిర్వహిస్తున్నారు. గేట్ల వద్ద ఏర్పాటు చేసిన రూంలు శిథిలావస్థకు చేరాయి. వర్షాకాలం కావడంతో ఎప్పుడు కూలుతాయోనని ఆందోళన చెందుతున్నారు. సమస్యపై ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ : దేశంలో అత్యధిక ఆదాయాన్ని సంపాదించే రైల్వే శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. వికారాబాద్ నుంచి జహిరాబాద్ వరకు ఉన్న రైల్వే గేట్లల్లో విధులు నిర్వహిస్తున్న గేట్మెన్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారైంది. వికారాబాద్ మొదలుకొని జహీరాబాద్ వరకు ఎల్సీ లెవల్ క్రాసింగ్ గేట్లు 33 వరకు ఉన్నాయి. గేట్మెన్లు విధులు నిర్వహించేందుకు గేట్ల వద్ద రైల్వే శాఖలో ఐఓడబ్ల్యు విభాగం రూంలను ఏర్పాటు చేసింది. వాటిని చాలాకాలం క్రితం నిర్మించడంతో శిథిలావస్థకు చేరాయి.
దీంతో ఎప్పుడు కూలుతాయోననే భయం విధులు నిర్వహిస్తున్న గేట్మెన్లను వెంటాడుతోంది. వర్షాలు పడ్డాయంటే చాలు రూంలో ఉండాల్సిన గేటు మెన్లు రూం బయట వర్షంలో నిలబడాల్సి వస్తుంది.
వర్షానికి తడిసి ఎక్కడ కూలిపోతాయేనన్న భయాందోళనలో వారు విధులు నిర్వహిస్తున్నారు. ఎన్ని సార్లు ఉన్నతాధికారులకు గేట్ల పరిస్థితిపై విన్నవించిన పట్టించుకున్న పాపానపోవడం లేదని గే ట్మెన్లు వాపోతున్నారు. గేట్మెన్ల కోసం నిర్మించిన కాలం చెల్లిన నిర్మాణాలను తొలగించాలని పలుమార్లు రైల్వే కార్మిక సంఘాలు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
గేట్మెన్లను వేధిస్తున్న సమస్యలివే..
తాగడానికి గేట్మెన్ రూంల దగ్గర వేసిన బోర్లు పనిచేయవు. పనిచేసిన అందులో తాగడానికి నీరు ఉండదు. 1 నుంచి 33 గేట్ల వరకు ఎక్కువ శాతం మంచినీరు తాగడానికి సైతం అందుబాటులో లేక గేట్మెన్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరమ్మతులను పట్టించుకోవాల్సిన ఐఓడబ్ల్యు శాఖ అధికారులు మొద్దు నిద్ర వహిస్తుండడంతో గేట్మెన్ల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాత్రి పూట కరెంట్లేని గేట్లు ఎన్నో ఉన్నాయి. అదే విధంగా బాతురూంలు లేవు. డ్యూటీ రోస్టార్ అంటూ 12 గంటలపాటు విధులు నిర్వహించాల్సిందే. ఒక వేళ రిలీవర్ రాకపోతే మళ్లీ 12 గంటలపాటు తిండితిప్పలు లేకున్నా విధులు నిర్వహించాల్సిందే. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గేట్మెన్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
భయం గుప్పిట్లో విధులు
Published Sun, Jul 19 2015 11:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు
నిరాశపర్చిన ఈ–టూవీలర్స్ విక్రయాలు..
ఏకలవ్యలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గోదావరి వరదల సమయంలోనూ..
ఊహించని పరిహారం
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
కన్నీటి సుడులు.. కరిగె సూరీడు
జగన్ను మళ్లీ సీఎం చేసుకుందాం
గంటల్లోనే పరిహారం
హార్బర్ ప్రమాదంలో మూడో రోజే పరిహారం
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement