ఖమ్మం జెడ్పీ సెంటర్ : టీడీపీలో కొనసాగుతున్న ఆ నలుగురు నేతలు ప్రతీరోజూ పార్టీ మారనని దూషణలకు దిగుతున్నారని, వాళ్లను, ఆ పార్టీని ఎన్నడూ విమర్శించలేదని, కుట్రలతో విమర్శలు చేస్తున్న నాయకులకు ధైర్యముంటే రాజీనామా చేయాలని, అందుకు తానుకూడా సిద్ధమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత సవాల్ విసిరారు. శుక్రవారం ఆమె క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను టీడీపీ కోసం అహర్నిషలు పని చేశానని, ఉద్యోగాన్ని సైతం వదులుకుని అంకితభావంతో కార్యకర్తగా ఉన్నానని అన్నారు. ప్రజల ఆదరణతో చైర్పర్సన్ను అయ్యానని వివరించారు.
జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీపీలు, ఎంపీటీసీల అందరి నిర్ణయంతో, ప్రజలందరి మద్దతుతోనే తుమ్మల నాయకత్వంలో జిల్లాను అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్లోకి వెళ్లామని వివరించారు. విమర్శలు చేస్తున్న నాయకులను ఎన్నికల్లో గెలిపించేందుకు,అన్ని వర్గాల ప్రజలు, నేతలు, కార్యకర్తల కృషి, ఓట్లతో గెలిచారని, మమ్మల్ని రాజీనామ చేయమనే ముందు వారు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు తానుకూడా రాజీనామాకు సిద్ధమేనన్నారు. విమర్శలను ఇకనైనా మానుకోవాలని లేకుంటే బహిరంగ చర్చకు రావాలన్నారు. అసలు రాజీనామా ఎందుకు చేయాలనేది ముందు చెప్పాలన్నారు. చర్చకు వస్తానంటే అది ప్రెస్ క్లబ్,సంచాయతీరాజ్ కమిషనర్ వద్ద, అసెంబ్లీలోనా ఎక్కడైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు.
కన్నతల్లిలాంటి పార్టీని ముంచాలనే లక్ష్యంతో ప్రతీసారి నాయకులకు వెన్నుపోటు పొడిచారని, అదే తరహాలో తనకు సైతం 2000 సంవత్సరంలో కొత్తగూడెం చైర్మన్గా పనిచేసిన సమయంలో, ఇటివల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం అదే ధోరణితో వ్యవహరించారని అన్నారు. 2010లో సైతం పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలిగా ఎంపిక చేస్తే అప్పుడు చంద్రబాబుతో ఒత్తిడి తెప్పి అడ్డుకున్నారని అన్నారు. అలాగే చైర్ పర్సన్ ఎన్నిక రోజు కూడా అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. అయినా ఎన్నాడు ఎవరిని వ్యక్తి గతంగా దూషించలేదని, సహనం ఓర్పుతో ఉన్నా ఇంకా ఇలాంటి విమర్శలకు దిగడం సరికాదని అన్నారు.
కేసిఆర్ కాళ్ళు మొక్కి అత్మగౌరవాన్ని తాకట్టు పెట్టానని విమర్శలు చేస్తున్నారని, పెద్దలను గౌరవించడం మన సంస్కృతి సంప్రదాయమని, చైర్ పర్సన్గా ఎన్నికైన రోజు కూడా టీడీపీలోని సీనియర్ నాయకులు పంచాక్షరయ్య కాళ్లకు మొక్కానని, అంత మాత్రాన అది కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టినట్లేనా అని ప్రశ్నించారు. ఆరోజు మాట్లాడని నాయకులు ఈ రోజు విమర్శల చేయడం సహేతుకం కాదన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాయకత్వంతో జిల్లాను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు ప్రభంజనంలా వెళ్లామని గుర్తు చేశారు.
మీరు రాజీనామా చేస్తే నేనూ సిద్ధమే..
Published Sat, Dec 13 2014 4:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
ఓసీపీ..ఉక్కిరిబిక్కిరి
‘నల్లసూరీడు’పై నజర్
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
Advertisement