ముంబైలో బాలిక అదృశ్యం.. వికారాబాద్లో ప్రత్యక్షం తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
వికారాబాద్ రూరల్: మార్కులు తక్కువ రావడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మందలించారని మనస్తాపం చెందిన ముంబై బాలిక ఇంట్లోంచి వచ్చింది. వికారాబాద్కు చేరుకున్న ఆమెను స్థానిక పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శంషొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం... ముంబై థానే సమీపంలోని అమృత్నగర్కు చెందిన బాలిక జోయా(15) స్థానిక యూనివర్సల్ ఆర్టిక్ బీహాండ్ మోహ్ర ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.
ఈనెల 12న పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని బాలికను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన జోయా ఇంట్లోంచి బయటకు వచ్చింది. మరుసటి రోజు హైదరాబాద్ చేరుకుంది. అక్కడి నుంచి హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ రైలులో వికారాబాద్కు చేరుకుంది. ఉదయం 11.30 నుంచి వికారాబాద్ రైల్వేస్టేషన్లో కూర్చున్న జోయాను ఆర్పీఎఫ్ సిబ్బంది గమనిస్తుండగా సాయంత్రం సమయంలో ఫినాయిల్ తాగేయత్నం చేసింది. వెంటనే అడ్డుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు 1098 చైల్డ్లైన్ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. చైల్డ్లైన్ సిబ్బంది దేవకుమారి, రామేశ్వర్లు అక్కడికి చేరుకుని వికారాబాద్ పోలీసులకు విషయం చెప్పారు. అనారోగ్యంగా ఉన్న బాలికను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె చెప్పిన సమాచారంతో తన తల్లిదండ్రులకు వివరాలు తెలియజేశారు. బాలికను సోమవారం ఉదయం ఆస్పత్రి సిబ్బంది డిశ్చార్జి చేశారు. పోలీసులు ఆమెను చైల్డ్లైన్ అధికారులు సమక్షంలో ఉంచారు.
జోయా తల్లిదండ్రులు వికారాబాద్కు చేరుకుని పోలీసులను సంప్రదించారు. జోయా 12వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆమె తల్లిద ండ్రుల ఫిర్యాదు మేరకు ముబ్రా ఠాణాలో కిడ్నాప్ కేసుగా నమోదు చేశామని ఇక్కడికి వచ్చిన సంబంధింత ఠాణా కానిస్టేబుల్ తెలిపాడు. బాలికను హైదరాబాద్లోని సీడబ్ల్యూసీకి అప్పగించి వారి ద్వారా ఆమెను తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. అదృశ్యమైన బాలిక క్షేమంగా దొరకడంతో జోయా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులు మందలించారని..
Published Tue, Dec 15 2015 3:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement