జమ్మికుంట: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. యువతికి వచ్చిన పెళ్లి సంబంధాలన్ని చెడగొట్టి.. చివరికి పెళ్లికి నిరాకరించాడు ఓ యువకుడు. దీంతో మోసపోయిన యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ సంఘటన జగిత్యాల మండలంలోని విలాస్నగర్లో బుధవారం వెలుగుచూసింది.
వివరాలు..గ్రామానికి చెందిన తాటిపల్లి చందు(24) బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన డిగ్రీ చదువుతున్న సుమలతతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత రెండేళ్లుగా ఇద్దరు అన్యోన్యంగా ఉంటున్నారు. కొన్నిరోజులుగా సుమలత కుటుంబ సభ్యులు చూసిన సంబంధాలన్నింటిని చందు చెడగొడుతున్నాడు.
దీంతో ఆగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు తమ కూతురిని పెళ్లి చేసుకోమని చందును అడిగారు. అతను పెళ్లికి నిరాకరించడంతో బుధవారం సుమలత ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. విషయం తెలుసుకున్న సీఐ ప్రశాంత్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వారికి సర్దిచెప్తున్నారు.