అలంపూర్/ మానవపాడు : ‘వర్షాభావ పరిస్థితులతో పంటలే కాదు... తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. కనీసం ఆర్డీఎస్ కాల్వల ద్వారారైనా జూరాల నీళ్లు వదిలి ఆదుకోవాలి..’ అంటూ రెండు మండలాల రైతులు బూడ్దిపాడు క్యాంపులోని ఆర్డీఎస్ కార్యాలయం ఎదుట ఆదివారం ఉదయం 11 గంటలకు ఆందోళనకు దిగారు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ఈఈ రమేష్, ఏఈలు వరప్రసాద్, రాజు; సిబ్బందితోపాటు నాయకులు వరన్నగౌడ్, బోరవెల్లి సత్యారెడ్డి, ప్రకాశంగౌడ్ను కార్యాలయంలో నిర్బంధించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలంపూర్, మానవపాడు మండలాల్లో కరువుఛాయలు అలుముకుని చెరువులు, కుంటల్లో నీరు లేక భూరగ్భ జలాలు అడుగంటాయన్నారు. దీంతో ఉండవెల్లి, కంచుపాడు, చిన్న అముదాలపాడు, కోనేరు, బుక్కాపురం, ఉట్కూరు, లింగవనాయి ప్రజలు, మూగజీవాలకు తాగునీటి సమస్య జఠిలంగా మారిందన్నారు. జూరాల కింద పంట సాగు అలస్యమవుతుంది కాబట్టి అంతవరకు జూరాల లింకు ద్వారా కిందికి నీళ్లు వదలాలన్నారు.
జూరాల నీటిని కిందికి వదలాలనే హక్కు లేదని అధికారులు చెబుతున్నా మానవతాదృక్పథంతో నీటిని వదిలేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విద్యుత్ కోతలు తీవ్రంగా ఉండటంతో తాగునీటి బోర్లు పనిచేయడం లేదని, బోరుబావుల కింద, ఎత్తిపోతల పథకాల కింద వేసిన పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు.
ట్యాంకుపైకి ఎక్కి నిరసన
అనంతరం ఇద్దరు రైతులు ఆర్డీఎస్ క్యాంపు కార్యాలయ ఆవరణలో ఉన్న నీటి ట్యాంకు ఎక్కి కొద్దిసేపు నిరసన తెలిపారు. కనీసం తాగునీటికైనా నీళ్లు వదలడానికి అధికారులు చొరవ చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారంకాకపోతే జాతీయ రహదారిని లేదా జూరాల కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
అక్కడ ఉన్న తోటి రైతులు వారించడంతో కిందికి దిగివచ్చారు. రైతులు పెద్ద సంఖ్యలో ఆర్డీఎస్ కార్యాలయానికి చేరడంతో ఎస్ఐ విజయకుమార్ పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంపత్కుమార్ హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. అలాగే ట్రాన్స్ ఎస్ఈ సదాశివరెడ్డికి ఫోన్లో విషయం చెప్పి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు. చివరకు మధ్యాహ్నం 3.30 గంటలకు నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేసి వెనుదిరిగారు.
తాగడానికైనా నీళ్లు వదలండి
Published Mon, Aug 18 2014 3:36 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement