మృగశిర కార్తె ప్రవేశించింది. వర్షాకాలం ప్రారంభమైంది. ఖరీఫ్ సీజన్కోసం రైతన్న సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ప్రస్తుతం రుణమో రామచంద్రా అని అన్నదాత ఎదురు చూస్తున్నాడు. రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం, కొత్తగా రుణాలివ్వడానికి బ్యాంకర్లు ముందుకు రాకపోవడంతో ఈసారి ఖరీఫ్కు పెట్టుబడి గండం పట్టుకుంది. దీంతో మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు వచ్చాయి.
కామారెడ్డి : జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 3.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. 4.42 లక్షల మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో అధిక శాతం మంది చిన్న, సన్నకారు రైతులే కావడం వల్ల పెట్టుబడుల కోసం వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు అవసరమైన పెట్టుబడులను ఆయా బ్యాంకుల ద్వారా పొందేవారు. ఈసారి రుణాల మాఫీ వ్యవహారం ముందుకు రావడంతో పెట్టుబడులకు అప్పు సమస్యగా మారింది.
ఇప్పటికే పంటల సాగుకు అయ్యే వ్యయం విపరీతంగా పెరిగి ఇబ్బందులు పడుతున్న రైతులు.. అవసరమైన పెట్టుబడులు ఎక్కడి నుంచి తెచ్చేదని ఆవేదన చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు నుంచే రాజకీయ పార్టీలన్నీ పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో చాలా మంది రుణాలను చెల్లించలేకపోయారు. దానికి తోడు గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో కరెంటు సమస్యలు, ఆపై అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని కర్షకులు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రుణాలు మాఫీ అవుతాయని, ఖరీఫ్ సాగుకు కొత్త రుణాలు అందుతాయని ఆశించారు. అయితే రుణ మాఫీ విషయంలో ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం మూలంగా కొత్త రుణాలు అం దే పరిస్థితి లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు ఎక్కడి నుంచి తెచ్చేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తప్పని పరిస్థితుల్లో...
పెట్టుబడుల కోసం రైతులు బ్యాంకుల్లో అప్పులు పొందారు. మరికొందరు రైతులు పెట్టుబడులు సరిపోని పరిస్థితుల్లో భార్య, పిల్లల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. రుణాలు మాఫీ అవుతాయన్న ఆశతో ఎక్కడి బాకీలు అక్కడే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పెట్టుబడుల సమస్య రైతులను వేధిస్తోంది. ఖరీఫ్ పనులకు శ్రీకారం చుట్టిన రైతులు పెట్టుబడుల వేటలో పడ్డారు.
బ్యాంకులకు వెళితే లాభం లేకపోవడంతో మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గతంలో వడ్డీ వ్యాపారుల వలలో పడి ఆర్థికంగా చితికిపోయిన రైతులు గత కొన్నేళ్లుగా వారికి దూరమయ్యారు. తిరిగి పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే పంట రుణ మాఫీ విషయంలో స్పష్టమైన ప్రకటన చేసి, ఖరీఫ్ పెట్టుబడుల సమస్యను తీర్చాలని కర్షకులు కోరుతున్నారు.
రుణమో రామచంద్రా!
Published Wed, Jun 11 2014 4:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement