మంజీరా నది.. కాలక్రమేణా ఎడారిగా మారబోతుందా? దీని చెంతనే ఉన్న డీఫ్లోరైడ్ పథకానికి ముప్పు ఏర్పడనుందా? మంజీరా నదిలో ఇసుక తవ్వకాల నేపథ్యంలో ప్రజలను ఈ ప్రశ్నలు కలవరపెడుతున్నాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారుు. ‘ఇది నిజం. భవిష్యత్తులో జరిగేది ఇదే’ అని, వారు తీవ్ర భయూందోళన వ్యక్తం చేస్తున్నారు.
- ఇసుక రవాణాను అడ్డుకోకపోతే జరిగేది ఇదే
- భయూందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు
- ఇసుక తవ్వకాలతో ఢీఫ్లోరైడ్ పథకానికి ముప్పు..
- అయినప్పటికీ ఇసుక తవ్వకాలకు ప్రభుత్వ అనుమతి
కోటగిరి : ఒకవైపు, వర్షాభావ పరిస్థితులతో ఎక్కడికక్కడ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. మరోవైపు, భూగర్భ జలాలను పరిరక్షించే నదుల్లోని ఇసుకను ఆసాంతం తోడేసేందుకు ప్రభుత్వం అనుమతినిస్తోంది. ప్రజల ప్రయోజనాలను విస్మరించిన ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటగిరి మండలం పోతంగల్, కారేగాం మంజీరా నుంచి ఇసుక తవ్వకాలు.. రవాణాకు టీఎస్ ఎండీసీ అనుమతి ఇవ్వడంపై ఆయూ గ్రామాల రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు.
ఢీఫ్లోరైడ్ పథకానికి ముప్పు
కారేగాం మంజీరా చెంతన ఢీఫ్లోరైడ్ పథకం ఉంది. సిరికొండతోపాటు బోధన్ మండలంలోని పలు గ్రా మాలకు ఇక్కడి నుంచి డీఫ్లోరైడ్ నీరు సరఫరా అవుతోంది. మంజీరా నుంచి ఇసుక తరలింపుతో ఈ డీ ఫ్లోరైడ్ పథకానికి మున్ముందు ముప్పు (నీళ్లు అందని పరిస్థితి) ఏర్పడే ప్రమాదముందని సిరికొండ, బోధన మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక లారీలను అడ్డుకున్న రైతులు
పోతంగల్, కారేగాం మంజీరా నుంచి ఇసుకను రవాణా చేస్తున్న లారీలను ఆయూ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తే భూగర్బ జలాలు అడుగంటే ప్రమాదముందని, అందుకే లారీలను అడ్డుకున్నామని వారు చెబుతున్నారు. ఇసుకను తరలించవద్దంటూ వారంతా రోడ్డెక్కారు.
బైండోవర్ కేసులు
ఇసుక లారీలను అడ్డుకున్న ప్రజలపై అధికారులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. అంతేకాదు.. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతున్న ఇసుక రవాణాను అడ్డుకున్న వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తాం’ అని, అధికారులు బెదిరిస్తున్నారు.
అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట
ఇసుక రవాణాను నిలిపివేయాలని కోరుతూ కారేగాం గ్రామస్తులు ఇటీవల బోధన్ ఆర్డీఓకు వినతిపత్రమిచ్చారు. పోతంగల్ గ్రామస్తులు కూడా ఇటీవల కోటగిరి తహశీల్దార్కు వినతిపత్రం ఇచ్చారు. తవ్వకాల కోసం ఒకచోట అనుమతి తీసుకుని.. మరోచోట తవ్వుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. మంజీరా చెంతనే బ్రిడ్జి, ఢీఫ్లోరైడ్ పథకం ఉన్నాయని.. ఇసుక తవ్వకాలతో వీటికి మున్ముందు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మంజీరా.. ఎడారే
Published Mon, Aug 31 2015 3:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement