సాక్షి, మంచిర్యాల : మున్సిపాలిటీలకు నిధులు అందజేసేందుకు ముందుగా సమస్త సమచారం దగ్గరుండాలనే రాష్ట్రస్థాయి ఆదేశాల మేరకు అధికారులు బిజీ అయ్యారు. ఈ మేరకు జిల్లాలోని ఏడు మునిసిపాలిటీల అధికారవర్గాలు సమాచార సేకరణలో మునిగాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలతోపాటు నగరపాలక సంస్థల్లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులతోపాటు నిబంధనలన్నీ పాటిస్తూ అనుమతి పొంది కట్టిన నిర్మాణాలెన్ని, అక్రమ కట్టడాలెన్ని అనే వివరాలను సర్కారు సేకరిస్తోంది.
మన వార్డు-మన పట్టణం-మన ప్రణాళికల ఆధారంగా ఈ నివేదికలను సిద్ధం చేయాలని స్థానిక అధికారులను సూచించింది. అదే సమయంలో రాష్ట్రంలోనూ నివేదికను పరిశీలించనున్నట్లు స్పష్టం చేసింది. ఆయా మున్సిపాలిటీల్లో జరిగిన నిర్మాణాల పూర్తి వివరాలతోపాటు వాటి ద్వారా సమకూరిన మొత్తం వంటి సమస్త వివరాలను తమ ముందుంచాలని పాలకులు ఆదేశించడంతో అధికారులు దస్త్రాల దుమ్ము దులుపుతున్నారు.
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..
మన ప్రణాళికలో 16 అంశాలతో కూడిన జాబితాను పురపాలక సంఘాలకు అందజేసింది. ఇందులో అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి. అనుమతి లేకుండా ఎ రకమైన అక్రమం చేశారు? ఆయా అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలను అందులో పొందుపరిచారు. భవన నిర్మాణాలకు జారీచేసిన ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రాలు, సెట్బ్యాక్లు, లేఔట్ల ప్రకారం అయిన నిర్మాణాలు, పురపాలక పరిధిలో లేఔట్ అనుమతి లేకుండా వెలిసిన వెంచర్లపై చర్యలు సర్కారుకు వివరించాల్సి ఉంది.
తాజాగా నిర్మాణాల కోసం వచ్చిన దరఖాస్తులు, అందులో అనుమతించినవి, తిరస్కరించినవి పేర్కొనాల్సి ఉంది. భవన నిర్మాణాల ద్వారా వచ్చిన ఫీజులు, అక్రమ నిర్మాణాలకు విధించిన ఫీజులు, తద్వారా సమకూరిన సొమ్ము? వంటి సమస్త వివరాలను పూర్తిస్థాయిలో అందజేయాలని కోరడంతో ఆయా విభాగపు అధికారుల్లో గుబులు మొదలైంది. నిబంధనల ప్రకారం చూస్తే.. అనుమతి లేని నిర్మాణాలు ఉన్నట్లయితే స్థానిక బిల్డింగ్ ఇన్స్పెక్టర్, టౌన్ప్లానింగ్ ఆఫీసర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఇంతకాలం అక్రమ నిర్మాణాలు జరగుతుంటే ఏం చేస్తున్నారు అనే ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతోపాటు మెమో ఇవ్వడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం వంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే ఆలోచన అధికారుల్లో మెదులుతోంది. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను ప్రస్తావిస్తూనే భవిష్యత్తులో ఇబ్బందికాని రీతిలో సమాచారం ఇవ్వాలనే యోచనలో కొందరు అధికారులున్నట్లు సమాచారం.
లెక్క తేల్చండి
Published Mon, Aug 11 2014 12:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement