హైదరాబాద్ : ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని... ఎమ్మెల్సీగా పోటీ చేయని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా మిత్రులతో తలసాని శ్రీనివాసయాదవ్ చిట్చాట్ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కాదా... ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ పదవి చేపడతారా అని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు తలసాని శ్రీనివాస యాదవ్ పైవిధంగా స్పందించారు.
తెలంగాణలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి చేపట్టిన తలసాని శ్రీనివాస యాదవ్ మళ్లీ ఎన్నికల పోటీ చేసేందుకు బయపడుతున్నారని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం అసెంబ్లీలో ఎద్దేవా చేశారు. దమ్ముంటే రాజీనామా చేసినట్లు సభలో ప్రకటించాలని ఆయన తలసానికి సవాల్ విసిరారు. ప్రజలను మభ్యపెట్టేందుకు తలసాని రాజీనామా డ్రామా ఆడుతున్నారని సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. ఈ అంశాన్ని కూడా శ్రీనివాసయాదవ్ వద్ద మీడియామిత్రులు ప్రస్తావించారు.
గత ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తలసాని టీడీపీ టిక్కెట్పై గెలుపొందారు. అనంతరం టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన ఇప్పటి వరకు తన రాజీనామాను ఆమోదించుకోలేకపోయారు. దీంతో తలసాని వైఖరిపై పలు రాజకీయ పార్టీల వారు ఆరోపణలు సంధిస్తున్న సంగతి తెలిసిందే.
'ఎమ్మెల్యేగానే.. ఎమ్మెల్సీగా పోటీ చేయను'
Published Sat, Mar 14 2015 12:24 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement