కాంగ్రెస్లోకి జగ్గారెడ్డి
- నేడు దిగ్విజయ్ సమక్షంలో చేరిక
- భారీఎత్తున జన సమీకరణ
- ఎమ్మెల్సీ బరిలో దింపే అవకాశం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎట్టకేలకు మాజీ ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్రెడ్డి సొంతగూటికి చేరుతున్నారు. సోమవారం గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి 10 వేల మందితో కలిసి వెళ్లి సత్తా చాటాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన అనుచరులు భారీ జన సమీకరణ ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది జగ్గారెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డీసీసీ అధ్యక్షునిగా ప్రకటించింది. ఆయన బాధ్యతలు తీసుకోవడానికి సమాయత్తం అవుతుండగానే ప్రకటనను రద్దు చేసింది.
దీంతో ఆయన కొంత మనస్తాపంతో ఉన్న సమయంలోనే మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయడానికి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మరోవైపు జనసేన నాయకుడు పవన్కళ్యాణ్ ఒత్తిడి చేయడం చేయడంతో జగ్గారెడ్డి బీజేపీలో చేరారు. ఆపై మెదక్ ఉప ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అనంతరం నెల నుంచే జగ్గారెడ్డి తిరిగి కాంగ్రెస్లో చేరడానికి ప్రయత్నం సాగించారు. ఆయన చేరిక పట్ల మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సానుకూలత వ్యక్తం చేసినా.. డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, ఎమ్మెల్యే, మాజీ మంత్రి గీతారెడ్డి, దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి తదితరుల అభ్యంతరం వ్యక్తం చేయడంతో చేరిక ఆలస్యమైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల నేరుగా ఢిల్లీ వెళ్లి రాహుల్గాంధీని కలిసి, పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం. రాహుల్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో జగ్గారెడ్డి ఏర్పాట్లను చేసుకున్నారు.
ఎమ్మెల్సీగా బరిలోకి..!
త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో జగ్గారెడ్డి కాంగ్రెస్లో చేరటం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలం ఉన్నా... ఎక్కువ మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలు టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ నుంచి పోటీకి అభ్యర్థులెవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో జగ్గారెడ్డిని బరిలోకి దింపితే పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
సొంత గూటికి..
Published Sun, Aug 30 2015 11:14 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement