సాక్షి, సంగారెడ్డి: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంచుతూ తెలంగాణ సర్కార్ బుధవారం జీవో జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గత మార్చిలో అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా... జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ చైర్మన్ల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. ఈ పెరిగిన వేతనాలు ఏప్రిల్ మాసం నుంచి వర్తింపజేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీకతీతంగా హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్లు మాత్రం మరింత పెంచాలని కోరుతున్నారు. ఈ నిర్ణయంతో జిల్లాకు సంబంధించి ప్రభుత్వంపై ప్రతినెలా దాదాపు రూ.76 లక్షల అదనపు భారం పడుతుంది.
పెంపు ఇలా...
జెడ్పీ చైర్పర్సన్ గౌరవ వేతనం ఇంత వరకు నెలకు రూ.7,500 ఉండగా దాన్ని ఏకంగా రూ.లక్షకు పెంచారు. జెడ్పీటీసీలకు రూ.2250 నుంచి రూ.10 వేలకు, ఎంపీపీలకు రూ.1,500 నుంచి రూ.10 వేలకు, ఎంపీటీసీలకురూ.750 నుంచి రూ.5వేలకు, సర్పంచ్లకు రూ.1,500 నుంచి రూ. 5 వేలకు, మున్సిపల్ చైర్మన్లకు రూ.8వేల నుంచి రూ.12 వేలకు, వైస్చైర్మన్లకు రూ.3,200 నుంచి రూ.5 వేలకు, కౌన్సిలర్లకు రూ.1,800 నుంచి రూ.2,500కు పెరిగింది.
ఇదీ లెక్క...
జిల్లాలో చైర్పర్సన్తో పాటు 46 మంది జెడ్పీటీసీ, 46 మంది ఎపీపీ, 685 మంది ఎంపీటీసీ, 1066 మంది సర్పంచ్లు ఉన్నారు. వీరందరికీ ప్రస్తుతం ప్రతినెలా గౌరవ వేతనం రూపేణా రూ.22.92 లక్షలు వెచ్చిస్తున్నారు. కాగా వేతనం పెంపు నిర్ణయంతో అదనంగా రూ.74.82 లక్షల భారం ప్రతినెలా పడుతుంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకుగాను ఐదుగురు చైర్పర్సన్లు, ఐదుగురు వైస్చైర్మన్లు, 150 మంది కౌన్సిలర్లకు మొత్తంగా ప్రతినెలా రూ.3.26 లక్షలు వేతనంగా చెల్లిస్తున్నారు. పెరిగిన వేతనం ఫలితంగా అదనంగా ప్రతినెలా మరో రూ.1.34 లక్షలు ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కాగా, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గత జనవరి నుంచి గౌరవ వేతనాలు అందటం లేదు. బకాయిలతో సహా ఇప్పుడు గౌరవ వేతనాలు అందవచ్చని అధికారులు చెబుతున్నారు.
ధన్యవాదాలు...
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేయటం ఆనందంగా ఉంది. గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కించపరిచాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వేతనాలను అనూహ్యంగా పెంచడం ఎంతో సంతోషకరం. ఆయనకు ధన్యవాదాలు.
- మనోహర్గౌడ్, జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షులు
పెరిగిన గౌరవం
Published Thu, Jun 25 2015 1:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement