Sakshi News home page

'దిగ్విజయ్ సింగ్ ను పిచ్చాసుపత్రిలో చేర్చాలి'

Published Mon, Nov 24 2014 12:52 PM

'దిగ్విజయ్ సింగ్ ను పిచ్చాసుపత్రిలో చేర్చాలి' - Sakshi

హైదరాబాద్:ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు.మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎంఐఎం సమర్ధిస్తోందన్న దిగ్విజయ్ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ కు సిగ్గుంటే ముందు గ్రేటర్ హైదరాబాద్ ఎంఐఎంకు మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అండతోనే మేయర్ పదవిలో ఎంఐఎం కొనసాగుతుందని కిషన్ రెడ్డి అన్నారు.

 

దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ దివాళకోరుతనానికి నిదర్శనమన్నారు. ఎంఐఎంను ఎదుర్కొనే సత్తా ఒక్క బీజేపీకే ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో ఆదివారం నిర్వహించిన మైనారిటీ సమ్మేళనంలో బీజేపీని దిగ్విజయ్ సింగ్ విమర్శించిన సంగతి తెలిసిందే.  మహారాష్ట్రలో ప్రభుత్వ విశ్వాస పరీక్షకు ఎంఐఎం దూరంగా ఉండి బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలిపిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీని గెలిపించేందుకు అక్కడ ఎంఐఎం పోటీకి దిగుతుందని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement