సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల సమస్యలపై నిరసన వ్యక్తంచేయడానికి కూడా అవకాశం లేకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అఖిలపక్ష నేతలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు గురువారం గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో జంతర్మంతర్ దగ్గర ధర్నా చేస్తామని సాక్షాత్తూ శాసనమండలిలోనే చెప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, రాష్ట్రంలో మాత్రం ఇందిరాపార్కు దగ్గర ధర్నాచౌక్ లేకుండా చేయాలని నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని వారు గవర్నర్కు విన్నవించారు.
ఈ బృందంలో ఉత్తమ్ కుమార్రెడ్డి (టీపీసీసీ అధ్యక్షుడు), కె.లక్ష్మణ్ (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు), ఎల్.రమణ (టీటీడీపీ అధ్యక్షుడు), చాడ వెంకటరెడ్డి (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి), నాగయ్య(సీపీఎం), కె.శివకుమార్ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), ఆర్.కృష్ణయ్య(ఎమ్మెల్యే), మంద కృష్ణమాదిగ (ఎంఆర్పీఎస్), గోపాలశర్మ,, ఇటిక్యాల పురుషోత్తం (తెలంగాణ జేఏసీ), వెంకటేశ్వర్రావు (న్యూ డెమొక్రసీ), టి.కుమార్ (ఎంసీపీఐ– యూ), జానకి రాములు (ఆర్ఎస్పీ), బండా సురేందర్రెడ్డి (ఫార్వర్డ్బ్లాక్) తదితరులు ఉన్నారు.
ప్రజా సమస్యలపై నిరసన తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగ పరిరక్షకునిగా గవర్నరుపై ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంకోసం ఇందిరాపార్కు దగ్గర వందలకొద్ది సభలు, సమావేశాలు, నిరసన దీక్షలు జరిగాయని అఖిలపక్షం నేతలు గవర్నర్కు వివరించారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగుతున్నదనే కుంటి సాకుతో ధర్నాచౌక్ను ఇందిరా పార్కువద్ద లేకుండా చేయాలని ప్రభుత్వం ప్రయ త్నిస్తున్నదన్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బేగంపేటలోని క్యాంపు కార్యాల యానికి వేలమందిని తరలించారని, దానికి ట్రాఫిక్ అంతరాయం కలుగలేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించాచు. రాష్ట్రంలో 25 ఏళ్లుగా జరిగిన నిరసనలకు సంబంధించిన ఫోటోలను, క్లిప్పింగులను మంద కృష్ణ మాదిగ గవర్నర్కు చూపించారు. ధర్నాచౌక్ను తరలించవద్దని, శాంతియు తంగా జరిగే నిరసనలకు అవకాశం కల్పించాలని కోరారు.
ధర్నాచౌక్ను కొనసాగించాలి
Published Fri, Mar 17 2017 3:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement