మరుగుదొడ్లు లేని గృహాలు 18 వేల పైనే..
- మున్సిపాలిటీల్లో మూడోవంతు ప్రజలు ఆరుబయటకే..
- పట్టణాల్లోనూ కానరాని చైతన్యం
- నోటీసుల జారీలో అధికారులు నిమగ్నం..
- స్పందించని వారిపై ‘కొరడా’కు సిద్ధం..
సిద్దిపేట జోన్: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని మరింత అధిగమించేందుకు కలెక్టర్ నేతృత్వంలో గత యేడాది మున్సిపల్, నగర పంచాయతీల్లో ఐఎస్ఎల్ నిర్మాణాల కోసం ప్రణాళిక రూపొందించారు. అందుకు అనుగుణంగానే జిల్లాలోని మున్సిపల్, నగర పంచాయతీలో బహిరంగ మలవిసర్జన చేసే గృహాల సర్వేకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, సదాశివపేట, జహీరాబాద్, మెదక్తో పాటు నగర పంచాయతీలుగా గుర్తింపు పొందిన జోగిపేట, చేగుంట, గజ్వేల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు.
సుమారు నెల రోజుల పాటు 70.916 గృహాల్లో సర్వే నిర్వహించి బహిరంగ మలవిసర్జనకు పాల్పడుతున్న 18,626 గృహాలను గుర్తించారు. సంబంధిత యజమానులకు ఆయా మున్సిపల్ కమిషనర్ల పేరిట ముందస్తు నోటీసులకు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తొలివిడతగా సిద్దిపేట మున్సిపాలిటీలో గుర్తించిన 3,752 గృహాలకు ఫిబ్రవరిలో బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వ అదేశాలకు అనుగుణంగా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవాలని సూచిస్తూ, చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రాసిక్యూషన్కు సైతం వెనకాడేది లేదంటూ స్పష్టంగా నోటీసుల్లో జారీ చేశారు. 2013 పునరావాస చట్టం ప్రకారం బహిరంగ మలవిసర్జన నిషేధమని సెప్టిక్ ట్యాంక్ను కలిగి ఫ్లషింగ్ చేసేందుకు వీలుగా మరుగుదొడ్లను నిర్మించాలంటూ లిఖితపూర్వక నోటీసులను మున్సిపల్ అధికారులు జారీ చేశారు. సంబంధిత చట్టాన్ని విస్మరిస్తే వివిధ సెక్షన్ల ప్రకారం సంవత్సరం వరకు కఠిన కరాగార శిక్ష ఆమలవుతోందని హెచ్చరించారు.
నోటీసులు అందుకుని నెలలు గడిచినా కొన్ని మున్సిపాలిటీల్లో గృహ యజమానుల నుంచి స్పందన లేకపోవడంపై జిల్లా యంత్రాంగం కఠినంగా పరిగణించింది. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన సమీక్షలో సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు జిల్లాల అధికారులు స్పష్టమైన అదేశాలను జారీ చేసినట్లు సమాచారం. ఆరు నెలలలోపు సెప్టిక్ ట్యాంక్తో కూడిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టని, నోటీసులకు స్పందించని గృహ యజమానులపై కొరడా ఝుళిపించేం దుకు జూలైలో జిల్లా యంత్రాంగం భవిష్యత్ ప్రణాళికను రూపొందించనున్నట్లు సమాచారం.
లెక్క తేలింది!
Published Tue, Jul 1 2014 12:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement