-
ఉద్రిక్తత నడుమ ఆక్రమణల తొలగింపు
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల నగర పంచాయతీలో ఆక్రమణల తొలగింపు శుక్రవారం ఉద్రిక్తతకు దారి తీసింది. కడప రోడ్డులో ఉన్న సర్వే నంబరు 606బిలో ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలంలో కొందరు దళితులు చిన్నపాటి ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. మరి కొందరు దుకాణలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంపై కొద్ది రోజులుగా చర్చ సాగింది. శుక్రవారం కమిషనర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందొబస్తు నడుమ తొలగింపుకు పూనుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ నివాసం ఉంటున్న ఎనిమిది దళిత కుటుంబాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ తరుణంలో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకు దిగిన వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. తర్వాత మూడు జేసీబీలతో అక్రమణలను తొలగించారు. అనంతరం కమిషనర్ భవానీ ప్రసాద్ విలేకరులతో మట్లాడుతూ.. ఎంతో విలువైన ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని బాడుగలకు ఇస్తూ కిరాయిను వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ స్థలంలో ఎనిమిది మందికి పట్టాలు ఇచ్చారన్నారు. వీరికి ఇందిరమ్మ కాలనీలో స్థలం కేటాయిస్తామని చెప్పామన్నారు. ప్రభుత్వ స్థలంలో మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. పంచాయతీ అభివృద్ధి కోసం పట్టణంలో ఇతర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. కాగా, వేంపల్లె రోడ్డులోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఓ ఇంటిని పంచాయతీ సిబ్బంది కూల్చి వేశారు. ఆ సమయంలో ఆ ఇంటికి చెందిన వ్యక్తి అక్కడ లేకపోడంతో మున్సిపల్, రెవెన్యూ అధికారులు పంచనామా చేశారు. ఇంట్లో ఉన్న సామాన్లు నోట్ చేసి బయటకు తరలించారు. -
ఎవరి మెడకో!
హుజూరాబాద్ నగరపంచాయతీ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ నివేదిక! ♦ ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారుల్లో ఆందోళన ♦ సెలవుపై వెళ్లిన కమిషనర్ అబిద్ అదేబాటలో మేనేజర్? ♦ ఇన్చార్జి కమిషనర్గా ఎన్వీ నాగేంద్రబాబు ♦ బిల్లులు సర్ధుకునే పనిలో కౌన్సిలర్లు? హుజూరాబాద్ నగర పంచాయతీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటిదాకా కమిషనర్గా పనిచేసిన మహ్మద్ అబీద్ ఉన్నట్టుండి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. నగర పంచాయతీలో అక్రమాలపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలు పాలకవర్గాన్ని, అధికారులను కుదిపేశారుు. అవినీతి, అక్రమాలపై ఇంటెలిజెన్స్, స్పెషల్బ్రాంచ్ అధికారులు ఆరా తీసి ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు తెలిసింది. మరోవైపు కలెక్టర్ నీతూప్రసాద్ సైతం అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఫలితంగా పలువురు అధికారుల్లో ఆందోళన మొదలు కాగా, వీలైనంత త్వరగా బిల్లులు దక్కించుకునే పనిలో కౌన్సిలర్లు ఉన్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : హుజూరాబాద్ నగర పంచాయతీ పరిధిలో పలు అక్రమాలు జరుగుతున్నట్లు ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. అభివృద్ధి పనులకు టెండర్లలో సింహభాగం సింగిల్ టెండర్లు దాఖలు కావడం, అందులోనూ చాలా వరకు ఎక్సెస్ వేయడం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని, మోడల్ చెరువులోని చెట్లను నరికి విక్రయించారనే అంశాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇంటెలిజెన్స్ నివేదికతోపాటు అంతర్గత విచారణ నేపథ్యంలో నగర పంచాయతీ కమిషనర్ సయ్యద్ అబిద్ నాలుగు నెలల పాటు దీర్ఘకాలిక సెలవుపెట్టి వెళ్లిపోయూరు. ఆయన స్థానంలో గద్వాల మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారి(ఆర్వో)గా పనిచేస్తున్న ఎన్వీ నాగేంద్రబాబు బదిలీపై హుజూరాబాద్ నగర పంచాయతీ ఇన్చార్జి కమిషనర్గా నియమితులయ్యారు. ‘దీర్ఘకాలిక సెలవు’ ఆంతర్యమేంటో? ‘సాక్షి’లో వచ్చిన కథనాల నేపథ్యంలో కమిషనర్ అబిద్కు నగర పంచాయతీ చైర్మన్ వి.విజయ్కుమార్ రెండు నోటీసులు జారీ చేశారు. ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లకు బదులు వివరణలో బాక్స్ టెండర్లని ఎలా పేర్కొన్నారని, దీనివల్ల కౌన్సిల్ విలువ తగ్గిపోతోందనేది మొదటి నోటీసులోని సారాంశం. మరో నోటీసులో ‘కమిషనర్ స్థానికంగా నివాసం ఉండటం లేదు. నాన్ ట్యాక్స్ కలెక్షన్లు జరగడం లేదు. సంక్షేమ పథకాల అమలులో పర్యవేక్షణ లోపం ంటోంది. మొక్కుబడిగా వార్డు సందర్శన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మ్యుటేషన్, జన్మదిన పత్రాలు, అనుమతుల జారీలో జాప్యం జరుగుతోంది. పారిశుధ్య సిబ్బందిపై పర్యవేక్షణ లేదు’ అని పేర్కొంటూ ఈ ప్రశ్నలన్నింటికీ మూడు రోజుల్లో వివరణ ఇవ్వడంతోపాటు పనితీరు మార్చుకున్నట్లు రుజువు చేయాలని ఆదేశించారు. దీంతో ఈ అవినీతి, అక్రమాల వ్యవహారం తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే ఆందోళనతో కమిషనర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. బిల్లులెలా? ప్రస్తుతం నగర పంచాయతీలో బిల్లుల చెల్లింపు సమస్య పాలకవర్గాన్ని వేధిస్తోంది. బిల్లుల చెల్లింపు జరగాలంటే కమిషనర్ తప్పనిసరిగా ఉండాలి. ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో చెక్ పవర్ను మేనేజర్కు దఖలు పరుస్తూ తీర్మానించారు. మేనేజర్ సైతం ఈ వ్యవహారం తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే ఆందోళనతో సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. కమిషనర్ లేకపోవడం, మేనేజర్ సెలవుపై వెళ్లడంతో బిల్లుల చెల్లింపులు ఆగిపోయూరుు. దీంతో ఆందోళన చెందిన కొందరు పాలకవర్గ సభ్యులు ఇన్చార్జి కమిషనర్ను నియమించాలని ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గద్వాల మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ఎన్వీ నాగేంద్రబాబును హుజూరాబాద్ నగరపంచాయతీ ఇన్చార్జి కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించే కమిషనర్ ఎలా స్పందిస్తారనే చర్చ జరుగుతోంది. మరోవైపు అభివృద్ధి పనుల టెండర్లను కాంట్రాక్టర్ల ముసుగులో దక్కించుకున్న కొందరు కౌన్సిలర్లు నాణ్యత ప్రమాణాలను పాటించకుండానే తొందరగా పనులు పూర్తి చేసే పనిలో పడ్డారు. ఆయా పనులకు అవసరమైన నీటిని మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయిస్తూ పనులు జరుపుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. మరోవైపు కౌన్సిలర్లే ప్రత్యక్షంగా పనులు చేస్తున్నప్పటికీ నాసిరకంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తుండటంతో ఈ వ్యవహారం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే భయం కాంట్రాక్టర్లను వెంటాడుతోంది. -
నగర పంచాయతీల్లో పన్నుల మోత!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నగర పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి కొత్త ప్రభుత్వం మార్గాలు అన్వేషిస్తోంది. వీటి పరిధిలో ఆదాయ వనరుల సమీకరణకు పన్నుల మోత మోగించాలని నిర్ణయించింది. ఆయా పురపాలక సంఘాల్లో అభివృద్ధికయ్యే నిధులను స్థానికంగా సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో పన్నుల వడ్డనకు ప్రతిపాద నలు రూపొందిస్తోంది. దీంతో జిల్లాలో కొత్తగా ఏర్పడిన బడంగ్పేట, పెద్ద అంబర్పేట, మేడ్చల్, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీల ప్రజలపై పన్నుల భారం పడనుంది. ఆస్తిపన్ను, బెటర్మెంట్, అభివృద్ధి, వాణిజ్య ప్రకటనలు, వినోద పన్ను సహా పలు కేటగిరీల టాక్సులపై ప్రతిపాదనలు పంపాలని నగర పంచాయతీల కమిషనర్లకు రాష్ట్ర పురపాలకశాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పన్నుల పెంపుపై పురపాలికల యంత్రాంగం తర్జనభర్జనలు పడుతోంది. నాలుగు నగర పంచాయతీల పరిధిలో సాలీనా రూ.10 కోట్ల ఆదాయం రాకపోవడాన్ని గుర్తించిన ప్రభుత్వం.. పన్ను అసెస్మెంట్ పరిధిలోకి రాని కట్టడాలపై దృష్టి సారించాలని ఆదేశించింది. భారమే.. ఇప్పటివరకు గ్రామ పంచాయతీలుగా ఉండి... ఇటీవల నగర పంచాయతీలుగా ఏర్పడిన ఈ ప్రాంత ప్రజలపై వివిధ రకాల పన్నుల మోత మోగనుంది. కేవలం ఒకట్రెండు పన్నులు చెల్లింపుతో మమ అనిపించే స్థానికులు ఇకపై అనేక రూపాల్లో పన్నులు చెల్లించాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో ఆస్తిపన్ను, బెటర్మెంట్, అభివృద్ధి, వాణిజ్య ప్రకటనలు, వినోద పన్ను తదితరాల మదింపుపై పురపాలక సంఘాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే చాలా పంచాయతీల్లో ఆస్తిపన్ను వసూలు కావడంలేదు. ఈ నేపథ్యంలో అన్ అసెస్డ్ ప్రాపర్టీలను గుర్తించడం ద్వారా రాబడి పెంచుకునే దిశగా ఆలోచన చేస్తున్నాయి. అంతే కాకుండా పన్నుల నిర్ధారణలో హేతుబద్ధత పాటించాలని రాష్ట్ర సర్కారు ఆదేశించిన క్రమంలో... ప్రతి ఇంటి నీ సర్వే చేయాలని నిర్ణయించింది. పంచాయతీలతో పోలిస్తే నివాస గృహాలపై ఆస్తిపన్ను భారం రెట్టింపు కానుంది. అదేసమయంలో వాణిజ్య భవనాల టాక్సులు గణనీయంగా పెరిగే అవకాశముంది. పంచాయతీలతో పోలిస్తే బిల్డింగ్ పర్మిషన్ ఫీజులు అడ్డగోలుగా పెరిగాయని ఆందోళనతో ఉన్న స్థానికులకు తాజా ప్రతిపాదనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాగా, పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన ఆదాయ వనరుల సమీకరణకు పన్నుల పెంపే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. -
హస్తం.. హవా
- మూడు మునిసిపాలిటీలు కాంగ్రెస్ పరం - మరో రెండు నగర పంచాయతీల్లోనూ పాగా - కాంగ్రెస్ దోస్తీతో బీజేపీకి లబ్ధి - పాలమూరులో ఫలించని టీఆర్ఎస్ వ్యూహం - కాంగ్రెస్ సభ్యుడి మద్దతుతో టీడీపీకే వనపర్తి - కల్వకుర్తిలో వైఎస్ఆర్సీపీకి వైస్చైర్మన్ పీఠం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఎట్టకేలకు ‘పుర’సమరానికి తెరపడింది. ‘నువ్వా..నేనా!’ అనే రీతిలో ఉత్కంఠభరితంగా సాగిన మునిసిపల్ చైర్మన్, వైస్చైర్మన్ల పరోక్ష ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. బీజేపీతో దోస్తీ కట్టిన కాంగ్రెస్ మూడు మునిసిపాలిటీలు, రెండు నగర పంచాయతీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంది. అధికారపార్టీ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదిపినా.. జిల్లాలో ఒకేఒక్క నగర పంచాయతీని మాత్రమే తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ పక్కాప్లాన్గా అడుగులు వేసి మూడుచోట్ల వైస్ చైర్మన్ పీఠాలను సాధించుకోగలిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ మరోచోట వైస్చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. టీఆర్ఎస్కు సొంత బలం ఉన్న అయి జ నగర పంచాయతీలో మాత్రమే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను తన ఖాతాలో వేసుకోగలిగింది. సొంత బలంతో నారాయణపేట మునిసిపాలిటీ పీఠాన్ని బీజేపి దక్కించుకుంది. బీజేపీతో కలిసి వనపర్తి చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాం గ్రెస్ పావులు కదిపినా చివరకు టీడీపీ పైచేయి సాధించింది. కల్వకుర్తి నగర పం చాయతీలో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరస్పర సహకారంతో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్నాయి. మహబూబ్నగర్ మునిసిపాలిటీలో కాంగ్రెస్, టీఆర్ఎస్ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. రెండు పార్టీల తరఫున చైర్మన్ పదవికి నామినేషన్ వేయడంతో ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ, టీడీపీ మద్దతుతో 23ఓట్లు సాధించిన 38వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ రాధ అమర్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ తరఫున చైర్మన్గా నామినేషన్ వేసిన వనజాకు 21 ఓట్లు లభిం చాయి. ఎక్స్అఫీషియో సభ్యుల హోదాలో ఎంపీ ఏపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ జగదీశ్వర్రెడ్డి ఓట్లు వేసినా టీడీపీ మేజిక్ ఫిగర్ను సాధించలేకపోయింది. కాంగ్రెస్ శిబిరంపై పెట్టుకున్న ఆశలు ఫలించలేదని ఓటింగ్ సరళి వెల్లడించింది. వనపర్తి మునిసిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నిక నిర్వహించారు. బీజేపీ మద్దతుతో చైర్మన్ పదవి దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహం రచించినా సొంత పార్టీ కౌన్సిలర్ విప్ను ధిక్కరించి టీడీపీ చైర్మన్ అభ్యర్థికి మద్దతు పలికాడు. దీంతో టీడీపీ చైర్మన్ అభ్యర్థి రమేశ్గౌడ్కు 14 ఓట్లు, కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి లోక్నాథ్రెడ్డికి 13 ఓట్లు లభించాయి. వైస్ చైర్మన్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి బి.కృష్ణ, టీఆర్ఎస్ వైస్ చైర్మన్ అభ్యర్థి గట్టు యాదవ్కు 13 ఓట్లు లభించాయి. నాగర్కర్నూల్ నగర పంచాయతీలో బీజేపీతో జట్టు కట్టిన కాంగ్రెస్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. ఎంపీ నంది ఎల్లయ్య ఎక్స్అఫీషియో సభ్యుడి హోదాలో ఎన్నికకు హాజరయ్యారు. తగి న సంఖ్యాబలం లేకపోవడంతో చివరి నిముషంలో టీఆర్ఎస్ ఎన్నికల బరినుం చి తప్పుకోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కల్వకుర్తి నగర పంచాయతీలోనూ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య అవగాహన కుదరడంతో రెండు పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. తొలి మూడేళ్లు కాంగ్రెస్, చివరి రెండేళ్లు వైఎస్ఆర్ సీపీకి చైర్మన్ పదవి దక్కేవిధంగా పరస్పరం అంగీకారం కుదిరినట్లు సమాచారం. గద్వాల, షాద్నగర్ మునిసిపాలిటీలో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ సాధించడంతో రెండు పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. నారాయణపేట మునిసిపాలిటీలో బీజేపీ, అయిజ నగర పంచాయతీలో టీఆర్ఎస్ అభ్యర్థులు చైర్మన్, వైస్చైర్మన్ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
కొలువయ్యారు
- నగర, ‘పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారం - నరసాపురం మినహా అన్నిచోట్లా ఏకగ్రీవమే సాక్షి, ఏలూరు : ఏలూరు నగరపాలక సంస్థ, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు, తణుకు, కొవ్వూరు పురపాలక సంఘాలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల్లో పాలకవర్గా లు కొలువుతీరారు. ఏలూరులో 50 మంది కార్పొరేటర్లు, మిగిలిన మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో 241 మంది కౌన్సిలర్లు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఏలూరు మేయర్, మునిసిపల్ చైర్మన్ల ఎన్నిక, ఆ వెంటనే ఏలూరు డెప్యూటీ మేయర్, మునిసిపల్ వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వ హించారు. నరసాపురం మినహా అన్నిచోట్లా ఎన్నికలు ఏకగ్రీవమయ్యూయి. రాజకీయ పార్టీల తరఫున విప్లను ఎన్నుకున్నారు. అన్నిచోట్లా ప్రశాంత వాతావరణంలో ప్రమాణ స్వీకారం, ఎన్నికలు జరిగాయి. సారథులు వీరే : ఏలూరు నగరపాలక సంస్థ మేయర్గా షేక్ నూర్జహాన్డెప్యూటీ మేయర్గా ఏడాదిన్నర కాలానికి చోడే వెంకటరత్నంను ఎన్నుకున్నారు. నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు హాజరై విజేతలకు అభినందనలు తెలిపారు. భీమవరం మునిసిపల్ చైర్మన్గా కొటికలపూడి గోవిందరావు (చినబాబు), వైస్ చైర్మన్గా ముదునూరి సూర్యనారాయణరాజు ఎన్నికయ్యారు. తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్గా బొలిశెట్టి శ్రీనివాస్, వైస్ చైర్మన్గా గొర్రెల శ్రీధర్ ఎంపికయ్యూరు. పాలకొల్లు చైర్మన్గా వల్లభు నారాయణమూర్తి, వైస్ చైర్పర్సన్గా కర్నేని రోజారమణి ఎన్నికయ్యూరు. తణుకు చైర్మన్గా దొమ్మేటి వెంకట సుధాకర్, వైస్ చైర్మన్గా మంత్రిరావు వెంకటరత్నం ఎంపికయ్యారు. కొవ్వూరు చైర్మన్గా సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్ (చిన్ని), వైస్ చైర్మన్గా దుద్దుపూడి రాజా రమేష్ను ఎన్నుకున్నారు. ఇక్కడ వైస్చైర్మన్ పదవిని బీసీకి కేటాయించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. నాయకులు సర్ధిచెప్పడంతో శాంతిం చారు. నిడదవోలు చైర్మన్గా బొబ్బా కృష్ణమూర్తి, వైస్ చైర్మన్గా పేరూరి సాయిబాబా ఎన్నికయ్యారు. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ హాజరై పదవులు చేపట్టిన వారిని అభినందించారు. జంగారెడ్డిగూడెం చైర్పర్సన్గా బంగారు శివలక్ష్మి, వైస్ చైర్మన్గా అట్లూరి రామ్మోహనరావును ఎన్నుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ల సాయంతో... నరసాపురంలో 14 వార్డులను టీడీపీ, మరో 14 వార్డులను వైఎస్సార్ సీపీ గెలుచుకోగా, మూడుచోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ముగ్గురు ఇండిపెండెంట్లు టీడీపీ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ బలం 19కి చేరింది. దీంతో టీడీపీ నుంచి పసుపులేటి రత్నమాల చైర్పర్సన్గా, పొన్నాల నాగబాబు వైస్చైర్మన్గా ఎన్నికయ్యారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement