మీలో ఎవరు విజేత? | Sakshi
Sakshi News home page

మీలో ఎవరు విజేత?

Published Wed, Mar 16 2016 2:36 AM

meelo evaru vijetha Program?

హన్వాడ : మండల కేంద్రంలో మంగళవారం ‘మీలో ఎవరు విజేత’ కార్యక్రమం జరిగింది. దీనిని హన్వాడ జెడ్పీహెచ్‌ఎస్‌లోఉపాధ్యాయులు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఐదోతరగతి విద్యార్థులకు మాత్రమే నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలస్థాయిలో 18పాఠశాలల నుంచి 52మంది పాల్గొన్నారు. వీరందరికీ ప్రతిభా పరీక్ష నిర్వహించి  పది మందిని మాత్రమే ఎంపిక చేశారు. వీరిలో చివరకు కృష్ణవేణి, స్వాతి, భవాని, శ్రావణి, కవిత, బాలస్వామి రూ.వంద నుంచి రూ.వెయ్యి వరకు నగదు పురస్కారాలను గెలుచుకున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ జ్యోతి, ఎంఈఓ వెంకట్రాములు, పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి మదన్, ఉపాధ్యాయులు విశ్వనాథం, రవీందర్ హాజరయ్యారు.

Advertisement
Advertisement