నేతలపై కార్మికుల ఆగ్రహం | Sakshi
Sakshi News home page

నేతలపై కార్మికుల ఆగ్రహం

Published Wed, Aug 19 2015 8:28 AM

నేతలపై కార్మికుల ఆగ్రహం - Sakshi

శ్రీరాంపూర్: ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లోని 3వ మైన్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదని కార్మికులు ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యే దివాకరరావు బుధవారం ఉదయం 3వ మైన్స్‌ను సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా తమ సమస్యలు పరిష్కరించడంలేదని, ఎప్పుడు చూసినా హామీలతో కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు వారిని సముదాయించి ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని సమస్యలూ వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement