- మంత్రి రావెలకు గురుకుల పాఠశాలల సిబ్బంది వినతి
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60కి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తమకూ వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ఉద్యోగుల సమాఖ్య, బోధనేతర సిబ్బంది సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
శుక్రవారం సాయంత్రం ఆయా సంఘాల ప్రతినిధులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్బాబును సచివాలయంలో కలిసి వినతి పత్రాన్ని అంద జేశారు. హెల్త్ కార్డులు కూడా తమకిచ్చేలా చూడాలని కోరారు.
జీవో నంబర్ 59 ద్వారా 2007లో 1,200 మంది కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేశారని, వారికి నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రస్తుతం పనిచేస్తున్న మరో 900 మంది కాంట్రాక్ట్ టీచర్లను కూడా రెగ్యులరైజ్ చేయాలని అభ్యర్థించారు.