సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతను ప్రొత్సహించేందుకు నాబార్డు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఫండ్ (ఎఫ్ఐఎఫ్) ద్వారా మొబైల్ ఏటీఎం వ్యాన్లు కొనుగోలు చేశామని టీస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టీఎస్ఎస్సీఏబీ) ఉన్నతాధికారులు వ్యాన్ల తాళాలను డీసీసీబీల ముఖ్య కార్యనిర్వహణ అధికారులకు అందజేశారు.
ఈ వ్యాన్లు హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో సంచరిస్తాయన్నారు. సమావేశంలో నాబార్డ్ సీజీఎం రాధాకృష్ణ, టీస్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్, టీ స్కాబ్ సీబీఎం జ్యోతి పాల్గొన్నారు.
‘ఆర్థిక ప్రోత్సాహానికి మొబైల్ ఏటీఎంలు’
Published Tue, May 22 2018 1:11 AM
Related news
-
కరోనా టెర్రర్: హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం
ముంబై: కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్ల సౌకర్యార్థం ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొబైల్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్ను (ఏటీఎం) రంగంలోకి దింపింది. హైదరాబాద్సహా 19 నగరాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో మొబైల్ ఏటీఎం ప్రతిరోజు మూడు నాలుగు ప్రాంతాలను కవర్ చేస్తుంది. వీటి ద్వారా 15 రకాల లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు. వినియోగదార్లు నగదు స్వీకరణకు తమ ప్రాంతం దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ సౌకర్యం కల్పించినట్టు బ్యాంకు తెలిపింది. ఉద్యోగులు, కస్టమర్ల భద్రత కోసం సామాజిక దూరం, శానిటైజేషన్ ఏర్పాట్లు ఉన్నాయని వివ రించింది. గతేడాది లాక్డౌన్ సమయంలో 50 నగరాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన మొబైల్ ఏటీఎంలను లక్షలాది మంది వినియోగించుకున్నారు -
రేపు సిరిసిల్లకు గులాబీ దళపతి
సిరిసిల్లటౌన్ : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ మంగళవారం జిల్లాకేంద్రానికి రానున్నారు. ఈమేరకు పార్టీ శ్రేణులు జిల్లా కేంద్రంలోని బైపాస్రోడ్డు శివారు ప్రైవేటు స్థలంలో భారీబహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో వేదికను ఏర్పాటు చేస్తుండగా పనులను ఆదివారం కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్కుమార్ పరిశీలించారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుతో పాటుగా ఆయన సభాస్థలికి చేరుకుని పర్యవేక్షించారు. భారీబహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. వరుసగా రెండురోజులపాటు ఆయన సిరిసిల్లకు వచ్చి సభాస్థలిని పర్యవేక్షిస్తూ..ఏర్పాట్లపై పార్టీ నేతలకు సూచనలు చేశారు. 50 వేల మందికి సరిపడా.. బైపాస్ రోడ్డులో సుమారు 20ఎకరాల ప్రైవేటు స్థలాన్ని చదును చేసి భారీస్థాయిలో వేదికను రూపొందిస్తున్నారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలస్థాయి భారీ బహిరంగ సభ కావడం విశిష్టత చేకూరింది. ఇరు నియోజకవర్గాల ప్రజలకు అనుకూలం కావడంతో సిరిసిల్ల బైపాస్రోడ్డును కేసీఆర్ సభకు ఎంపిక చేశారు. సభాస్థలకి సమీపంలోనే హెలిప్యాడ్ నిర్మిస్తున్నారు. సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో సీఎం సభ ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా జరగుతున్నాయి. సుమారు 50 వేల మంది వరకు సభకు హాజరు అవుతారని అంచనా వేసి ఏర్పాట్లను చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు కేసీఆర్ వచ్చి ఇరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి సభలో ప్రసంగించి వెళ్లనున్నారు. ఉరకలెత్తిన ఉత్సాహం.. సీఎం కేసీఆర్ సిరిసిల్లకు రానుండటంతో గులాబీ పార్టీలో కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. మూడ్రోజులుగా సిరిసిల్ల నాయకత్వం సభ ఏర్పాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. గత ఎన్నికల్లో సైతం కేసీఆర్ సభ తర్వాత పార్టీ ప్రచారం తారాస్థాయికి చేరి 2014 ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కేటీఆర్, వేములవాడ నుంచి చెన్నమనేని రమేశ్బాబు గెలుపొందారు. కార్మిక, ధార్మిక క్షేత్రాలైన సిరిసిల్ల, వేములవాడలకు కేసీఆర్ ఇవ్వబోయే వరాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
మౌలిక వసతుల కల్పనకు కృషి
► టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు గంభీరావుపేట: గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రభు్వం కృషి చేస్తుందని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. మల్లుపల్లిలో రూ. 13లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గురువా రం భూమి పూజ చేశారు. అదే విధంగా రూ. 4 కోట్లతో కొత్తపల్లి, ము చ్చర్ల గ్రామాల మధ్య చేపట్టబోయే బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామా ల సమగ్రాభివృద్ధికి మంత్రి కేటీఆర్ చొరువతో నిధులు మంజూరవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమ్మరి గంగసాయవ్వ, సెస్ డైరెక్టర్ దేవేందర్యాదవ్, సర్పంచ్లు పద్మ, నాగరాజుగౌడ్, మల్లేశం, ఉప సర్పంచ్ శేఖర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ సంపూర్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు దయాకర్రావు, మాజీ అధ్యక్షులు రాజారాం, మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్, ఎంపీడీవో సురేందర్రెడ్డి, పీఆర్ డీఈ చంద్రశేఖర్, ఏఈ సాయిలు పాల్గొన్నారు. -
అమ్మో... ఒకటో తారీఖు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇదొక్క చోటే కాదు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎంలో సేవలు నాలుగు రోజులకే పరిమితమయ్యాయి. జిల్లా కేంద్రంలోనే వీటి పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో నగదు సమస్యను ఊహించుకోవచ్చు. ఈ నెల 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేసింది మొదలు ఇప్పటివరకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పకతప్పదు. ఇకపై ఈ నగదు కష్టాలు ప్రజలకు రెట్టింపు కానున్నాయి. ఒకటో తేదీ వచ్చేసింది... ఇక జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరాల్సిన పరిస్థితి. మరోవైపు జిల్లాలోని అన్ని బ్యాంకుల్లోనూ నగదు కొరత తీరలేదు. రూ.500, రూ.100 డినామినేషన్ నోట్లు తొలివిడతలో రూ.150 కోట్లు నగదు వస్తుందని జిల్లా ఉన్నతాధికారులు పది రోజులుగా చెబుతున్నా ఒక్క నోట్ల కట్ట కూడా జిల్లాకు రాలేదు. కొన్నిచోట్ల ఎస్బీఐ ఏటీఎంలు పనిచేస్తున్నా రూ.2000 నోట్లు తప్ప మరో నోటు కనిపించట్లేదు. ఇవి చేతికొచ్చినా చిల్లర నోట్లు లేక అవసరానికి అక్కరకురాని పరిస్థితి. ఇక పింఛనుదారులకూ కష్టాలు తప్పేట్లు లేవు. నగదురహిత లావాదేవీలు సాధ్యమేనా? రేషన్ మొదలుకొని పింఛను వరకూ, కూరగాయలు మొదలు కిరాణా వరకూ, చిల్లర కొట్టు నుంచి సూపర్ మార్కెట్ల వరకూ... ఇలా ప్రతి లావాదేవీని నగదు రహితంగా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అందుకనుగుణంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను అధికారులు ముమ్మరం చేశారు. అంతవరకూ బాగానే ఉన్నా నగదు లావాదేవీలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఆర్థిక లావాదేవీలు సక్రమంగా సాగాలంటే కనీసం 5 వేల స్వైప్ మిషన్లు అవసరం ఉంటుందని అధికారులే అంచనా వేస్తున్నారు. కానీ ప్రస్తుతం వినియోగంలో ఉన్నవి ఆరొందలకు మించవు. అవీ పెద్ద నోట్ల రద్దు ప్రకటనకు ముందు వచ్చినవే. ఇటీవల 150 వరకూ వచ్చినా అవి సరిగా పనిచేయట్లేదు. కాగితం మీదే వేతనం... జిల్లాలో టీచర్లు 17 వేల మంది వరకూ ఉన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు ఎనిమిది వేల మంది ఉన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు 20 వేల మంది వరకూ ఉన్నారు. చిరుద్యోగులు మరో ఐదు వేల మంది ఉన్నారు. వీరందరికీ బ్యాంకు ఖాతాల ద్వారానే జీతాలు, వేతనాల చెల్లింపు జరుగుతోంది. వీరందరూ నెల ప్రారంభ వారంలోనే ఏటీఎంలు, బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా చేయడం అలవాటు. అందుకే ఆ వారం రోజులు జిల్లాలోని ఏటీఎంలన్నీ కిటకిటలాడేవి. ఈనెల 8వ తేదీన పెద్ద నోట్ల రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనేటప్పటికే వారిలో చాలామంది నగదు విత్డ్రా చేశారు. అప్పటికే వివిధ చెల్లింపులకు నగదు పోను మిగిలిన రూ.1000, రూ.500 నోట్లు తమ ఖాతాల్లో జమ చేసుకున్నారు. కొంతమంది మార్పిడి చేసుకున్నారు. అయితే ఈసారి జీతాలు ఆన్లైన్లోనే చెల్లింపు ఉంటుందని ఆర్థిక శాఖ ప్రకటించింది. అంటే ఒకటో తేదీన కాగితం (ఖాతాలో) మీద జీతం పడినట్లు కనిపిస్తున్నా చేతికి నగదు చెల్లింపులు ఉండవు. ఒకవైపు నగదు చేతిరాకపోగా, చెల్లింపు అవసరాలకు తగినట్లు స్వైప్ మిషన్లు లేవు. దీంతో 1వ తేదీ నుంచి ఏటీఎంలు, బ్యాంకుల ముందు బారులు తీరినా నగదు చేతికొస్తుందో లేదోనని అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయి. పెద్ద నోట్లు ‘పని’కి రావట్లేదు:బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఎక్కువగా రూ.2000 నోట్లే ఇస్తున్నారు. అక్కడక్కడా రూ.100 నోట్లు ఇస్తున్నా అవన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోతున్నాయి. మిగతా రూ.50, రూ.20 నోట్లు పరిస్థితీ అంతే. చిల్లర లభ్యత పూర్తిగా తగ్గిపోవడంతో జిల్లాలో వ్యాపారాల పరిస్థితి రోజురోజుకు దీనావస్థకు చేరుతోంది. రూ.2000 నోట్లు తీసుకోవడానికి చిల్లర సమస్య కారణంగా వ్యాపారులు నిరాకరిస్తున్నారు. ఈ సమస్య దృష్ట్యా ఎవ్వరికివారు రూ.100, రూ.50 నోట్లను తమవద్దే ఉంచేసుకుంటున్నారు. పింఛనుదారులకు ఇక్కట్లే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులు జిల్లాలో 14వేల మంది ఉన్నారు. వారందరికీ 1వ తేదీనే బ్యాంకు ఖాతాల్లో పింఛను పడుతోంది. నిత్యావసర సరుకులు, మందులు, ఆసుపత్రికి వెళ్లడానికి ఈ డబ్బే ఎక్కువ మందికి ఆధారం. వారిపై ఆధారపడినవారూ కుటుంబాల్లో ఉంటారు. ఇప్పుడు పింఛను నగదు చేతికొచ్చే అవకాశం లేకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కోనున్నారు. -
పునరుద్ధరుణం దిశగా..
జంగారెడ్డిగూడెం : పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో 15 రోజులపాటు పరిమితులకు లోబడి నగదు మార్పిడి, పాతనోట్ల డిపాజిట్లకు మాత్రమే పరిమితమైన బ్యాంకులు.. ఇకపై సాధారణ సేవలపైనా దృష్టి సారించబోతున్నాయి. రోజువారీ నిర్వహించే అన్నిరకాల లావాదేవీలను పునరుద్ధరించాలని బ్యాంకు లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో గురువారం నుంచి సాధారణ సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పాత నోట్లను నేరుగా బ్యాంకుల్లో ఇచ్చి చిల్లర నోట్లు తీసుకునే కార్యక్రమానికి శుక్రవారం నుంచి ఫుల్స్టాప్ పడుతోంది. ఎవరి వద్దనైనా పాతనోట్లు ఉంటే.. శుక్రవారం నుంచి వారి అకౌంట్లలో జమ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల నోట్లకోసం వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ దృష్ట్యా గురువారం నుంచి పంట రుణాలు, బంగారాన్ని కుదువపెట్టుకుని ఇచ్చే రుణాలతోపాటు ఇతర కార్యాకలాపాలను యథావిధిగా చేపట్టనున్నారు. రుణాల వసూళ్లు, మొండి బకాయిల రికవరీ వంటి కార్యకలాపాలు సైతం మొదలు పెట్టాలని బ్యాంకులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. రుణాల మంజూరుకు ప్రత్యేక ఏర్పాట్లు బ్యాంకుల్లో 15 రోజులపాటు నిలిచిపోయిన రోజువారీ విధుల పునరుద్ధరణతో రుణాల మంజూరు, బకాయిల వసూళ్లపై బ్యాంకులు దృష్టి సారిస్తున్నాయి. రబీ సీజన్ కు సంబంధించి రైతులకు పంట రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రుణం పొందిన రైతులు వారానికి రూ.50 వేల వరకు ఖాతా నుంచి విత్ డ్రా చేసుకోవచ్చని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వ్యక్తుల ఖాతాలో ఉన్న నగదును డ్రా చేసుకునేందుకు వారానికి రూ.24వేలు పరిమితి అలానే ఉంది. ప్రజల చెంతకు మొబైల్ ఏటీఎంలు చిల్లర నోట్ల కొరతను తీర్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొబైల్ ఏటీఎంలను రంగంలోకి దింపింది. జిల్లాలో పలుచోట్ల మొబైల్ ఏటీఎంలు ప్రజల ముంగిటకు వెళ్లాయి. బ్యాంక్ సిబ్బంది వాహనాల్లో నగదు తీసుకెళ్లి క్యాష్ యాక్ట్ పోస్ మెషిన్ల ద్వారా ఖాతాదారులకు సొమ్ము పంపిణీ చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డు కలిగిన వారంతా రూ.2000 తీసుకునే అవకాశాన్ని కల్పించారు. వీటిద్వారా పూర్తిగా రూ.100 నోట్లు ఇస్తున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా సేవలందిస్తాం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలందించేందుకు ఏర్పాట్లు చేశాం. బంగారంపై రుణాలతోపాటు రబీకి సంబంధించి పంట రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లు తెరిచాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోజువారీ సాధారణ సేవలను పునరుద్ధరించాం. బ్యాంకుల్లో చాలావరకు రద్దీ తగ్గింది. అన్ని ఏటీఎంలను పునరుద్ధరించాం. ఇకపై మా బ్యాంకులో అన్ని రకాల సేవలు పొందవచ్చు. – కె.త్రినాథరావు, చీఫ్ మేనేజర్, ఆంధ్రాబ్యాంక్, జంగారెడ్డిగూడెం
Related News by category
-
నాగోల్లో 2 మెట్రో స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్: నాగోల్లో కొత్తగా ఎయిర్పోర్టు మెట్రో స్టేషన్ను నిర్మించనున్నారు. ఇప్పుడున్న స్టేషన్కు సమీపంలో ఎడమవైపున (ఎల్బీ నగర్ వైపు) ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు విశాలమైన స్కైవాక్ను నిర్మిస్తారు. రాయదుర్గం, అమీర్పేట కారిడార్లో నాగోల్కు చేరుకున్న ప్రయాణికులు అక్కడి నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు ఈ స్కైవాక్ మార్గంలో కొత్తగా నిర్మించే నాగోల్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్పోర్టు వరకు కొత్త కారిడార్ నిర్మాణం జరగనుంది. ఎయిర్పోర్టు మెట్రో రెండో దశలో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన నాగోల్ –శంషాబాద్ ఎయిర్పోర్టు కారిడార్ మార్గంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి పర్యటించారు. నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట జంక్షన్ వరకు 14 కిలోమీటర్ల దూరం ఆయన ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ అయిన సిస్టా ఇంజనీరింగ్, సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి కాలినడకన వెళ్లి పరిశీలించారు. ఈ అలైన్మెంట్లో నిర్మించనున్న మెట్రోస్టేషన్లు, అలైన్మెంట్పై అధికారులకు, ఇంజనీరింగ్ నిపుణులకు దిశానిర్దేశం చేశారు. అలైన్మెంట్ ఇలా...♦ నాగోల్ స్టేషన్ తర్వాత మూసీ నది బ్రిడ్జిని ఆనుకొని పెద్ద మంచినీటి పైపులు, భూగర్భ హైటెన్షన్ విద్యుత్ కేబుళ్లు ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో మెట్రో అలైన్మెంట్ను మరో 10 మీటర్లు ఎడమ వైపునకు జరపనున్నారు. మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందించిన దృష్ట్యా మూసీ నదిపై మెట్రో బ్రిడ్జిని పొడవైన స్పాన్లతో నిర్మించనున్నారు. ♦ మూసీ దాటిన తరువాత కొత్తపేట వైపున్న రోడ్డుకు కనెక్టివిటీని ఇస్తూ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులకు సదుపాయంగా ఉండేలా మరో స్టేషన్ను నిర్మించనున్నారు. నాగోల్ ఆర్టీఓ కార్యాలయం వద్ద అల్కాపురి జంక్షన్ (లక్కీ రెస్టారెంట్)కు సమీపంలో ఈ స్టేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రయాణికులు ఔటర్రింగ్రోడ్డుకు రాకపోకలు సాగించేలా కనెక్టివిటీ ఇవ్వనున్నారు. చాంద్రాయణగుట్ట ఇంటర్చేంజ్ స్టేషన్♦ చాంద్రాయణగుట్ట వద్ద విశాలమైన ఇంటర్చేంజ్ స్టేషన్ నిర్మించనున్నారు. ఈ రూట్ లో ఫ్లైఓవర్ నిర్మాణం దృష్ట్యా చాంద్రాయణగుట్ట వరకు చేపట్టనున్న పాతబస్తీ మెట్రో విస్తరణ పనులు, కొత్త టెర్మినల్ స్టేషన్ పనులు ఇంజనీరింగ్ సవాలుగా ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి చెప్పారు. రెండు కారిడార్లను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ ఇంటర్చేంజ్ స్టేషన్లో కాంకోర్స్, ప్లాట్ఫాంల ఎత్తును సరిచేయాల్సి ఉంటుందన్నారు.ఎల్బీనగర్లో మరో స్కైవాక్.. ♦ కామినేని ఆసుపత్రి వద్ద ఒక స్టేషన్ నిర్మించనున్నారు. ఆ తర్వాత ఎల్బీనగర్ జంక్షన్లో కొత్తగా ఎల్బీనగర్ ఎయిర్పోర్టు స్టేషన్ రానుంది. ఈ మార్గంలో అండర్పాస్తోపాటు, రెండు ఫ్లైఓవర్లతో మెట్రో కారిడార్ నిర్మాణంలో ఇంజనీరింగ్ సవాళ్లు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ♦ ఎల్బీనగర్ జంక్షన్కు కుడి వైపున కొత్తగా నిర్మించనున్న మెట్రోస్టేషన్ నుంచి ఎడమవైపున ఉన్న మరో స్టేషన్ (మియాపూర్–ఎల్బీనగర్ కారిడార్)కు మరో విశాలమైన స్కైవాక్తో అనుసంధానం చేయనున్నారు. మియాపూర్, అమీర్పేట మీదుగా ఎల్బీ నగర్కు వచ్చే ప్రయాణికులు ఇక్కడి నుంచి స్కైవాక్ మార్గంలో ఎల్బీనగర్ కొత్త ఎయిర్పోర్టు మెట్రో స్టేషన్కు చేరుకుంటారు. ♦ బైరామల్గూడ, సాగర్రింగ్ రోడ్డు కూడలిలో ఇప్పటికే ఎత్తయిన ఫ్లైఓవర్లు ఉన్నందున ఈ రూట్లో ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ ఎత్తును మరింత పెంచాల్సి ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఈ జంక్షన్లో మెట్రో స్టేషన్ ఎత్తును తగ్గించడానికి, అలైన్మెంట్ను ఫ్లై ఓవర్లకు కుడి వైపునకు మార్చాల్సి ఉంటుందన్నారు. అలాగే పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో మెట్రో స్టేషన్ను నిర్మించనున్నారు. ♦ మైత్రీ నగర్, కర్మన్ఘాట్, చంపాపేట జంక్షన్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, హఫీజ్ బాబానగర్ తదితర ప్రాంతాల్లో ప్రతిపాదించిన మెట్రో స్టేషన్లను చుట్టుపక్కల ఉన్న కాలనీలకు అందుబాటులో ఉండేలా కూడళ్లకు సమీపంలో నిర్మించనున్నారు. -
డబుల్ డెక్కర్ వద్దే వద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు హైదరాబాద్ రోడ్లపై గంభీరంగా విహరించిన ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి కనిపించటం లేదు. గతంలో తీవ్ర నష్టాలు రావటంతో వాటిని క్రమంగా వదిలించుకున్న ఆర్టీసీ, ఇక డబుల్ డెక్కర్ బస్సుల ఊసును పూర్తిగా తెరమరుగు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అశోక్లేలాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీతో ఉన్న టెండర్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్టు తెలిసింది. అప్పట్లో.. కేటీఆర్ కోరిక మేరకు నగరంలో 2004 చివరి వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. నిర్వహణలో నష్టాలు పెరుగుతుండటంతో వాటిని ఆర్టీసీ పక్కన పెట్టేసింది. మూడేళ్ల క్రితం నగరవాసి ఒకరు పాత డబుల్ డెక్కర్ ఫొటోను షేర్ చేస్తూ, నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు నడిపితే బాగుంటుందని సామాజిక మాధ్యమం ద్వారా కోరారు.దీనికి నాటి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి, ఆ బస్సులు నడిపే అవకాశాన్ని పరిశీలించాలని రవాణా శాఖను కోరారు. దీనికి రవాణాశాఖ సై అనటంతో ప్రయోగాత్మకంగా కొన్ని డబుల్ డెక్కర్ బస్సులు కొని నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. చాలా రోడ్లపై ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్ వంతెనలు ఏర్పడటంతో, వాటిని నడిపేందుకు ఇబ్బంది లేని కొన్ని మార్గాలను ఎంపిక చేసింది. సుచిత్ర మీదుగా సికింద్రాబాద్–మేడ్చల్ మధ్య, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్–పటాన్చెరు, అమీర్పేట మీదుగా కోటి–పటాన్చెరు, సీబీఎస్–జీడిమెట్ల, దుర్గం చెరువు కేబుల్ వంతెన మీదుగా నడపాలని నిర్ణయించింది. ఇక దేశంలోని పలు నగరాలకు డబుల్ డెక్కర్ బస్సులను సరఫరా చేస్తున్న స్విచ్ మొబిలిటీ సంస్థ టెండర్లు దక్కించుకుంది. ధర విషయంలోనూ ఆర్టీసీతో చర్చలు జరిపి ఖరారు చేసింది. సర్కారు మార్పుతో మారిన సీన్ అంతా.. ఓకే అనుకుని బస్సులు సరఫరా చేసే వేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ఫ్లైఓవర్లు, పాదచారుల వంతెనలతో డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ ఇబ్బందే కాకుండా నష్టాలు రావటం తథ్యమన్న భావనతో ఉన్న ఆర్టీసీ నాటి మంత్రి కేటీఆర్ కోరిక మేరకు అయిష్టంగానే వాటి కొనుగోలుకు ఒప్పుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోవటంతో ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు తెలిసింది. ఓల్వో లాంటి విదేశీ బ్రాండ్ బస్సుల నిర్వహణనే భారంగా భావిస్తున్న ఆర్టీసీ.. ఏకంగా ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.2 కోట్లయ్యే డబుల్ డెక్కర్ బస్సుల జోలికి పోవద్దని నిర్ణయించుకుంది. స్విచ్ మొబిలిటీ సంస్థకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్ కోసం డబుల్ డెక్కర్ బస్సుల తయారీ ప్రయత్నాన్ని విరమించుకుందని తెలుస్తోంది. ఆ బస్సులను ఆర్టీసీకి ఇవ్వొచ్చు కదా.. ప్రస్తుతం నగరంలో హెచ్ఎండీఏ 6 డబు ల్ డెక్కర్ బస్సులు తిప్పుతోంది. వాస్తవానికి పర్యాటకుల పేరుతో అవి రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నాయి. అంత ఖరీదైన బస్సులను ఇలా వృథాగా తిప్పే బదులు.. వాటిని సాధారణ ప్రయాణికుల సర్విసులుగా వినియోగిస్తే, ప్రయాణికులకు వెసులుబాటుగా ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా ప్రభు త్వం ఆలోచించి ఆ బస్సులను హెచ్ఎండీఏ నుంచి ఆర్టీసీకి స్వాధీనం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కంటెంట్ ఉంటేనే ‘కిక్కు.. క్లిక్’
సాక్షి, హైదరాబాద్: కంటెంట్లో కిక్కు ఉండాలి...అది ఉంటేనే క్లిక్ అవుతుందనే భావనలో రాజకీయ నాయకులు ఉన్నారు. జనంలోకి దూసుకెళ్లే వీడియోలు.. వినంగానే అర్థమయ్యేలా సోది లేకుండా చెప్పే నైపుణ్యం..నిశితంగా వైరిపక్షాన్ని ఇరుకున పెట్టే వ్యూహం.. లోక్సభ ఎన్నికల వేళ నేతలు ఈ తరహా కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.హైదరాబాద్కు చెందిన వికీపీడియా కంటెంట్ సొల్యూషన్స్ సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది కంటెంట్ రైటర్లు పనిచేస్తున్నారు. అసలు కంటెంట్ రైటింగ్ అంటే ఏంటో? ఎలా ఉంటుందో? ఎలా క్రియేట్ చేయాలో చెప్పేందుకు ప్రత్యేక శిక్షణ సంస్థలూ ఉన్నాయి. ఢిల్లీకి దగ్గర్లోని గుర్గావ్లో ఇలాంటి పేరెన్నికగల సంస్థల్లో చాలామంది శిక్షణ పొందుతున్నట్టు వీక్పీడియా సంస్థ అధిపతి కుమార్జైన్ తెలిపారు. ఇలా శిక్షణ తీసుకున్నవారు కొన్నేళ్లుగా ఎన్నికలు, ఇతర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరి ఆధ్వర్యంలో పనిచేసిన మరో 80 వేల మంది వరకూ కంటెంట్ రైటర్లుగా మారిపోయారు. ‘క్లిక్’మనిపించడమే సవాల్ రాజకీయపార్టీ ఏదైనా సరే ఎన్నికల్లో గెలవాలనే అనుకుంటుంది. ఈ దిశగానే వారి ఆశయాలు, ఆచరణ విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతుంది. వాట్సాప్, యూట్యూ బ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలా అన్ని సోషల్ మీడియాల్లోనూ తమ వాదన ‘క్లిక్’కావాలనే కోరుకుంటాయి. ఇక్కడే కంటెంట్ రైటర్ ప్రావీణ్యత ముడిపడి ఉంది. నేతను జనంలో నిలబెట్టే మెళకువలు అందిపుచ్చుకోవడంలో దేశవ్యాప్తంగా 60 శాతం కంటెంట్ రైటర్లు విజయం సాధిస్తున్నారని ఢిల్లీకి చెందిన ఇండియా కంటెంట్స్ మేనేజర్ విజయ్కుమార్ మల్హోత్రా తెలిపారు. పోస్టు పెట్టాక రివ్యూ చేస్తారు. ఎంతమందికి అది రీచ్ అయింది తెలుసుకుని.. సరైన స్పందన లేకపోతే కంటెంట్ మార్చడానికి ప్రయత్నిస్తుంటారు. నాయకుడికి సంబంధింన కంటెంట్ రైటర్ తను పెట్టే వీడియోలు, ఫొటోలు ఓటర్లకు రీచ్ కాకపోతే కంటెంట్ రైటర్ చిక్కుల్లో పడ్డట్టే. దీనికోసం కంటెంట్ రైటర్లు కూడా సొంత ఫాలోవర్స్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. మంచి గిరాకీనే..కంటెంట్ రైటర్లకు ఎన్నికల సీజన్లో మంచి గిరాకీ ఉంటుంది. ఒక్కో సంస్థ పరిధిలో కనీసం 50 మంది పనిచేస్తుంటారు. నాయకుడి అందించే కాన్సెప్ట్ అర్థం చేసుకొని, అందుకు అనుగుణంగా అవసరమైన డైలాగ్స్, సెటైర్లతో కంటెంట్ ఇవ్వడం వీరి బాధ్యత. దీనిని వీడియో ఎడిటర్ చిత్రీకరణలోకి తీసుకెళతాడు. చిత్రం చాలా తేలికగా ఉండాలంటే, ఈజీగా ఉండే పదాలు, వాడుక భాషను కంటెంట్ రైటర్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్ అందిచడం అనేక విధాలుగా ఉంటుందని ది రైటర్స్ అనే సంస్థకు చెందిన విఠల్ తెలిపాడు. అధికార పార్టీ నేత పోటీ చేస్తున్నప్పుడు ప్రభుత్వ పథకాలు, జరిగిన లబ్దిపై ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో విపక్షాలు లేవనెత్తే ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా కంటెంట్ ఇవ్వాలి. దీనిని వీలైనంత తక్కువ నిడివి గల వీడియో చిత్రీకరణకు అనువుగా ఉండాలని నేతలు కోరుతున్నట్టు కంటెంట్ రైటర్లు చెబుతున్నారు. విపక్షమైతే ఎదురుదాడి ప్రధానాస్త్రంగా కిక్ ఎక్కించే కంటెంట్ కోరుకుంటోంది. కంటెంట్ క్లిక్ అయ్యే దాన్ని బట్టి రెమ్యూనరేషన్ డిమాండ్ ఉంటోంది. కొంతమంది ఎన్నికల సమయం వరకూ ప్యాకేజీగా రూ.25 నుంచి రూ.40 లక్షల వరకూ తీసుకుంటున్నారు. మరికొంతమంది నేతలు వారి స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఇది కూడా రూ.10 లక్షలకు తక్కువ ఉండదు. -
అధిక ఉష్ణోగ్రత... ఆపై ఉక్కపోత!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు మాడుపగిలే ఎండ, వడగాడ్పులు... మరోవైపు చెమటలు కారేలా ఉక్కపోత. ఇదీ శనివారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణ పరిస్థితి. రాష్ట్రంలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ సీజన్లో ప్రస్తుతం నమోదు కావాల్సిన సాధారణ సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ♦ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. రానున్న మూడు రోజులు ఇదే తరహాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగుడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాలకు ఈ నెల 28 నుంచి 30 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ప్రచండ భానుడు.. రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.4, నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 45.3, ములుగు జిల్లా మల్లురులో 45.2 డిగ్రీల సెల్సీయస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే మహబూబ్నగర్లో 43.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు మించి నమోదయ్యాయి.మహబూబ్నగర్లో సాధారణం కంటే 3.3 డిగ్రీల సెల్సియస్, ఖమ్మంలో 3.2 డిగ్రీల సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా మిగతా ప్రాంతాల్లో ఒక డిగ్రీ సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పెద్దలు, పిల్లలు, దీర్ఘకాలిక సమస్యలున్న వారు బయటకు రాకపోవడమే మంచిదని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.ఆకు రాల్చిన అభయారణ్యం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల అభయారణ్యం వేలాది ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. అన్ని రకాల జంతువులు, పక్షులకు నిలయమిది. సరస్సు చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం పచ్చదనంతో అన్ని రకాల పక్షుల అలజడితో చూడముచ్చటగా ఉండేది. వేసవిలో మండుతున్న ఎండలతో చెట్లన్నీ ఆకురాలడంతో అటవీ ప్రాంతమంతా బోసిపోయి ఇలా కనిపిస్తోంది. – నర్సంపేట -
సోషల్ మీడియాలోకి కేసీఆర్ ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఎక్స్( ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ తెరిచారు. అయితే ఇంతకాలం కేసీఆర్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు ఉద్యమ కాలం నాటి తన ఫొటోను కేసీఆర్ జత చేశారు.బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం అని కోరుతూ కేసీఆర్ రెండో ట్వీట్ చేశారు.కాగా ప్రస్తుతం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి.. ఆయా నియోజకవర్గాల్లో రోడ్షోలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్.. ఇకపై ఈ రెండు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలను ఈ ఖాతాల్లో కేసీఆర్ పంచుకోనున్నారు. నేడు నాగర్కర్నూల్కుశనివారం ఉదయం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సి వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సాయంత్రం నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా రోడ్షో, కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు.
Advertisement
Photos
View allVideo
View allహైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement