ఆదిలాబాద్ :జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్లో బాహా బాహీ చోటుచేసుకుంది. శనివారం ఉదయం 10.15 గంటల ప్రాంతంలో ఈ వివాదం జరిగింది. సాక్షాత్తు జిల్లా మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ జగన్మోహన్, ఎస్పీ తరుణ్జోషిలు సంఘటనా స్థలానికి కూతవేటు దూరంలో జెడ్పీ సమావేశ మందిరంలో ఉన్నా.. ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈని నిర్మల్ ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్ చెప్పుతో కొట్టాడనే ప్రచారం గుప్పుమంది. బిల్లు సెటిల్మెంట్ వివాదమే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. ఈ విషయంలో సదరు అధికారి కూడా కనీసం తన ఉన్నత అధికారికి ఫిర్యాదు చేయడంగాని, పోలీసుస్టేషన్లో కేసు పెట్టడం గాని చేయకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మరోపక్క అధికారి విషయంలో సదరు కాంట్రాక్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం గాని.. ఏసీబీని ఆశ్రయించడం గాని చేయాల్సిందిపోయి దాడికి పాల్పడడం సబబుకాదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.
బిల్లు సెటిల్మెంట్ వివాదమే..
జెడ్పీ కార్యాలయంలో పైఅంతస్థులోని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కార్యాలయంలో శనివారం ఉదయం డిప్యూటీ ఈఈని ఓ కాంట్రాక్టర్ ఆ సమయంలో అక్కడ ఉన్న అటెండర్ల సమక్షంలోనే చెప్పుతో కొట్టినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించడం లేదు. తాము సమావేశంలో ఉన్నామని.. వివాదం తన దృష్టికి రాలేదని ఈఈ మూర్తి పేర్కొన్నారు. కాగా నిర్మల్ ప్రాంతానికి చెందిన ఆ కాంట్రాక్టర్ నిర్మల్ డివిజన్లో గతేడాది వేసవిలో బోరువెల్ పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. సుమారు 40 పనులకు సంబంధించి సుమారు రూ.20 లక్షల వరకు ఆయనకు బిల్లులు రావాల్సి ఉంది. దీనికి సంబంధిం చి కాంట్రాక్టర్కు డిప్యూటీ ఈఈకి బిల్లుల చెల్లింపులో పలుమార్లు వివాదాలు జరిగినట్లు సమాచారం. 13 ఫైనాన్స్ కింద గ్రాంట్ రిలీజ్ కాకపోవడంతో బిల్లు చెల్లించలేదని అధికారి చెబుతున్నాడు. కాగా ఈ విషయంలో మరో ప్రచారం జరుగుతోంది.
ఇతర కాంట్రాక్టర్లకు సంబంధించి ముఖ్యంగా జిల్లా నేతలకు దగ్గర సంబంధాలున్న కాంట్రాక్టర్లకు ఇటువంటి పనుల్లోనే ఇతర గ్రాంట్ల నుంచి బిల్లులు చెల్లించారని, తన విషయంలో మాత్రం ఇతర గ్రాంట్ల నుంచి బిల్లులు చెల్లిం చకపోవడం పట్ల కాంట్రాక్టర్ ఆగ్రహంతోనే అధికారిపై దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య ఈ బిల్లు సెటిల్మెంట్ విషయంలో వివాదం కొనసాగుతున్నట్లు శాఖలో ప్రచా రం జరుగుతోంది. తాను మేజర్మెంట్ అన్ని పూర్తిచేసి బిల్లులను నిర్మల్ పీఏవో కార్యాలయానికి 9 నెల ల కిందట పంపినట్లు డిప్యూటీ ఈఈ చెబుతున్నారు. 13 ఫైనాన్స్ కింద గ్రాంట్ రిలీజ్ కాకపోవడంతో బిల్లు చెల్లించలేదని పేర్కొంటున్నారు. ఈ విషయంలో కాంట్రాక్టర్ను సంప్రదించేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. గతంలో వేరే జిల్లాలో పనిచేసినప్పుడు ఈ అధికారి అవినీతి కేసులో ఏసీబీకి కూడా పట్టుబడినట్లు సమాచారం. ఈ విషయంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇంద్రసేన్ను వివరణ కోరగా.. తాను పుష్కరాల పనుల పరిశీలనలో ఉన్నత అధికారులతో కలిసి ఉన్నట్లు వివరించారు. ఈ విషయం తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు. ఎవరు ఫిర్యాదు కూడా చేయలేదని తెలిపారు.
జెడ్పీలో బాహాబాహీ
Published Sun, Jun 28 2015 2:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement