సాక్షి, రంగారెడ్డి జిల్లా: పట్టణ ప్రాంతంలోని పింఛన్దారులంతా ఆధార్ కార్డు వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఆధార్ వివరాలను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసిన అనంతరం పింఛన్ డబ్బులను లబ్ధిదారుడి వ్యక్తిగత ఖాతాలో వేయాలని పేర్కొంది.
ఈ క్రమంలో లబ్ధిదారులకు వివరాలు సమర్పించడానికి మార్చి నెలాఖరునాటికి గడువిస్తూ.. వివరాలు సమర్పించని వారికి పింఛన్లు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కొందరు లబ్ధిదారులకు సమాచార లోపం, మరికొందరికి ఆధార్ కార్డులు అందకపోవడంతో స్పందన కరువైంది. మరోవైపు ఎన్నికల హడావుడిలో ఉన్న యంత్రాంగం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించలేదు. దీంతో మెజారిటీ లబ్ధిదారులు ఆధార్ వివరాలు ఇవ్వలేదంటూ అధికారులు గ్రేటర్ పరిధిలోని 59,820 మందికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇందిరమ్మ పింఛన్ల చెల్లింపులు నిలిపివేశారు.
రూ.11.63 కోట్లు వెనక్కు..
ఆధార్ అనుసంధానం చేయలేదనే సాకుతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎనిమిది నెలలుగా పింఛన్లు పంపిణీ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం పాత పింఛన్ల పథకం రద్దు చేస్తూ, కొత్తగా ఆసరా పథకాన్ని అమల్లోకి తేవడంతో ఇందిరమ్మ పింఛన్లకు సంబంధించి రూ.11.63 కోట్లను జిల్లా యంత్రాంగం తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. దీంతో ఆయా లబ్ధిదారులంతా పింఛన్లకు దూరమయ్యారు. ఇటీవల ఈ అంశంపై పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగాన్ని నిలదీయగా.. ఆధార్ వివరాలు అనుసంధానం చేసుకున్న వారి వివరాలు ప్రభుత్వానికి నివేదించినట్లు అధికారులు పేర్కొన్నారు.
నమోదు చేసుకుంది 30 వేలమందే..
ఇందిరమ్మ పింఛన్ లబ్ధిదారులను ప్రభుత్వం ఆధార్ వివరాలు కోరిన నేపథ్యంలో 59,820 మంది లబ్ధిదారుల్లో 30 వేల మంది మాత్రమే ఆధార్ వివరాలు ఇచ్చినట్లు డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వివరాలు సమర్పించిన 30 వేల మంది లబ్ధిదారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇన్చార్జి పీడీ చంద్రకాంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం నివేదికను పరిశీలించి నిధుల విడుదలకు అంగీకరిస్తే 30 వేల మందికి పింఛన్ బకాయిలు వచ్చే అవకాశం ఉంది. దీంతో మిగతా 29,820 మందికి పింఛన్లు అందే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
‘ఆధార్’ లేదని..
Published Tue, Nov 25 2014 11:59 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగనన్నను మళ్లీ సీఎం చేద్దాం
కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
4 రోజులు సిట్ కస్టడీ
కాల్చివేసిన మహిళ మృతదేహం గుర్తింపు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
హడలెత్తిస్తున్న అగ్ని ప్రమాదాలు
పంటల బీమా వర్తించలేదని రైతుల నిరసన
లాభం చూపెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు
వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి
హోసూరు వార్తలు..
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement