విద్యార్థిని చితకబాదిదిన పీఈటీ | Sakshi
Sakshi News home page

విద్యార్థిని చితకబాదిదిన పీఈటీ

Published Thu, Jul 5 2018 12:21 PM

PET Beated Student - Sakshi

ఇటిక్యాల (అలంపూర్‌): క్రమశిక్షణ పాటించడం లేదంటూ 9వ తరగతి విద్యార్థిని పీఈటీ చితకబాదిన ఘటన ఇది. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదిత్య 9వ తరగతి చదువుతున్నాడు. ఈ మేరకు ఆదిత్య క్రమశిక్షణగా ఉండడం లేదని చెబుతూ పీఈటీ కర్రతో చితకబాదాడు. ఈ ఘటనలో విద్యార్థి మోచేతికి తీవ్రగాయమైంది.

విషయం తెలియడంతో విద్యార్థి తల్లిదండ్రులు బుధవారం పాఠశాలకు చేరుకుని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ సైదానాయక్‌తో గొడవకు దిగారు. అలాగే, టీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్‌ కుర్వ పల్లయ్య తదితరులు చేరుకుని ప్రశ్నించారు. అంతేకాకుండా విషయాన్ని ఉమ్మడి జిల్లా గురుకులాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ ఫ్లారెన్స్‌ రాణికి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ఈ విషయమై ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ సైదనాయక్‌ను వివరణ కోరగా. విద్యార్థి క్రమశిక్షణ పాటించకపోవడంతో పీఈఈ మందలించాడనితెలిపారు.

Advertisement
Advertisement