విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా | Sakshi
Sakshi News home page

విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా

Published Mon, Apr 6 2015 5:07 PM

pharma studenrt died in warangal

వరంగల్: స్నేహితులతో కలిసి ఈతకెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కరీమాబాద్‌లో సోమవారం జరిగింది. వివరాలు..తాళ్లపద్మావతి ఫార్మసీ కళాశాలలో పటేల్ కిషన్(22)  ఫార్మా-డి చదువుతున్నాడు. కాగా, కాలేజీకి సమీపంలో ఉన్న బావిలో ఈత కొట్టేందుకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లాడు. అయితే, ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. దీంతో తోటి స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా, కిషన్, కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(కరీమాబాద్)

Advertisement
Advertisement