-
ఫార్మా విద్యార్థినికి సోనుసూద్ సాయం
సాక్షి, ఇబ్రహీంపట్నం: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనుసూద్ తన ఊదారతను మరోసారి చాటుకున్నారు. ఇబ్రహీంపట్నంలోని ‘గురునానక్ ఇనిస్టిట్యూషన్స్’లో ఫార్మా సెకండ్ ఇయర్ చదువుతున్న దేవికారెడ్డికి ఆర్థిక సాయం అందజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ గ్రామానికి చెందిన దేవికారెడ్డికి గత సంవత్సరం కన్వీనర్ కోటాలో ఫార్మా.డి సీటు ఇబ్రహీంపట్నంలోని ‘గురునానక్ ఇనిస్టిట్యూషన్స్’లో వచ్చింది. ఏడాదికి ఫీజు రూ.లక్షా 15వేలు చెల్లించాలి. చదవండి: (రజనీ కోసం 28 ఏళ్లుగా ఓటు భద్రం..) అయితే, కన్వీనర్ కోటా కావడంతో ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం నుంచి రూ.68వేలు వస్తుంది. మిగతా రూ.47 వేలు కాలేజీకి చెల్లించాల్సి ఉంది. గత సంవత్సరం అతి కష్టం మీద చెల్లించిన దేవికారెడ్డి.. ఈసారి తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. తండ్రి ఫర్టిలైజర్స్ షాపులో చిరుద్యోగి, తల్లి గృహిణి. కాగా, సోనూసూద్ తన తల్లి పేరుపై ఓ ఇనిస్టిట్యూట్ను ప్రారంభించి పేద విద్యార్థుల ఉన్నత చదువులకు స్కాలర్షిప్ ఇస్తామంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గత నెల 5న 'సాక్షి' హైదరాబద్ సిటీ టాబ్లాయిడ్లో 'అమ్మకు ప్రేమతో' శీర్షికనన కథనం ప్రచురితమైంది. ఈ కథనం చదివిన దేవికారెడ్డి, ట్విటర్లో సోనూసూద్కు తన కష్టాన్ని విన్నవించింది. తాను ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నట్లు, తమది పేద కుటుంబమని, సాయం చేయాలని కోరింది. ఇదే విషయాన్ని ఆమె 'సాక్షి' ప్రతినిధికి చెప్పగా.. దేవిక వివరాలు సేకరించి సోనూసూద్కు సమాచారం ఇచ్చారు. దీనికి స్పందించిన సోను.. దేవికారెడ్డికి రూ.47వేలు ఫీజుతో పాటు, రూ.2,500 కలిపి రూ.49,500 చెక్కును యూనివర్శిటీ పేరుపై పంపారు. ఆ చెక్కును సోనూసూద్ అభిమాని గౌటే గణేశ్ కళాశాల ప్రిన్సిపల్ అశోక్కుమార్కు అందజేశారు. -
వైవీయూ జ్ఞానభేరి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి కడప : ప్రస్తుతం మారుతున్న కాలంలో విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టాలని.. తద్వారా వినూత్న ప్రయోగాలతో సత్ఫలితాలను ఆవిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. మంగళవారం సాయంత్రం యోగి వేమన యూనివర్సిటీలో జ్ఞానభేరి కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి మాట్లాడుతూ పిల్లలు ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కంప్యూటర్ కాలంలో ఎక్కడ చూసినా డిజిటలైజేషన్ కనిపిస్తోందని.. విద్యార్థులు కూడా ఒక విజన్ ప్రకారం ముందుకెళితే విజయం సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ప్రతి అంశం కూడా ప్రస్తుతం రియల్ గవర్నెన్స్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. వయా డాట్ కామ్ మంత్రను వినియోగిస్తున్నామని.. దీనిపై నాయకులతోపాటు ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని చెప్పారు. రానున్న 2050 నాటికి అనేక అంశాలకు సంబంధించిన టార్గెట్లు పెట్టుకున్నామని.. ప్రపంచంలో అన్ని అంశాల్లోనూ నెంబర్ వన్గా మనమే ఉంటామని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడేలా ప్రయోగాలు చేసేందుకు ఆలోచనలు చేయాలని పేర్కొన్నారు. కలలు కనండి.. నిజం చేసుకోండి.. కాని పక్షంలో అమలు చేయడానికి నేనుంటానని బాబు పేర్కొన్నారు. ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన కేంద్రం అన్ని విధాలా రాష్ట్రానికి అన్యాయం చేసిందని, ఏ ఒక్క అభివృద్ధి విషయంలో కూడా మేలు చేయలేదని సీఎం దుమ్మెత్తిపోశారు. కడపలో ఖనిజ వనరులతోపాటు కరెంటు, భూమి, నీరు, రోడ్లు అన్నీ ఉన్నా ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని విమర్శించారు. నాలుగేళ్లపాటు ఎదురుచూశామని, ఇంతవరకు ఎలాంటి నిర్ణయం కేంద్రం నుంచి రాకపోవడంతో తామే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని సంకల్పించినట్లు బాబు తెలిపారు. అందుకు సంబంధిం చి ఈనెల 27వ తేదీన ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ‘ఫాతిమా’ విద్యార్థులకు న్యాయం చేస్తాం కడపకు సంబంధించి ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. అవసరమైతే వైద్య విద్యకు ప్రభుత్వమే గ్రాంటు ఇచ్చి వారి సమస్యను పరిష్కరించేలా ఆలోచిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీరు రాష్ట్రంలో ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి చరిత్ర సృష్టించామని.. మరొకమారు గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు కృషి చేస్తామని సీఎం తెలిపారు. రాయలసీమతోపాటు ప్రకాశం జిల్లా, కరువుతో అల్లాడిపోతున్న జిల్లాల్లో నీటిని పారిస్తామని.. తద్వారా సస్యశ్యామలం చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయానికి అండదండగా ఉంటూ ఉద్యాన హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు కృషి జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు సుమారు రూ. 25 కోట్లు అవసరమవుతుందని.. మంజూరు చేయాలంటూ ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో ఏర్పాటుకు కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్యాదవ్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ హరి కిరణ్, వైస్ చాన్స్లర్ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి, జేసీ కోటేశ్వరరావు, స్పెషల్ సెక్రటరీలు ఆదిత్యనాథ్దాస్, గిరిజాశంకర్, ఉన్నత విద్యాశాఖకమిషనర్ సుజాతశర్మ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ విజయరాజు, కార్యదర్శి వరదరాజన్, అధికారులు కోటేశ్వరరావు, వెంకట్ ఈదర్, టెక్సాస్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ కర్బారి, డాక్టర్ అశ్వంత్, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వర్లు, అవధాని గరికపాటి నరసింహారావు, సినీ గాయకుడు గంగాధర్శాస్త్రి పాల్గొన్నారు. -
విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా
వరంగల్: స్నేహితులతో కలిసి ఈతకెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కరీమాబాద్లో సోమవారం జరిగింది. వివరాలు..తాళ్లపద్మావతి ఫార్మసీ కళాశాలలో పటేల్ కిషన్(22) ఫార్మా-డి చదువుతున్నాడు. కాగా, కాలేజీకి సమీపంలో ఉన్న బావిలో ఈత కొట్టేందుకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లాడు. అయితే, ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. దీంతో తోటి స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టంకు తరలించారు. కాగా, కిషన్, కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (కరీమాబాద్)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement