హుజూరాబాద్/ఎల్కతుర్తి/కరీంనగర్: విప్లవకవి తాడిగిరి పోతరాజు(78) శుక్రవారం అనారోగ్యంతో కరీంనగర్లోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించి చనిపోయారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా అత్తిలి మండలం తాగికొడకు చెందిన రైతు కుటుంబంలో 1937లో తాడిగిరి పోతరాజు జన్మించారు.
తండ్రి రాయపరాజుతోపాటే 1950 ప్రాంతంలో కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ అనుబంధ గ్రామం శాంతినగర్కు వచ్చి స్థిరపడ్డారు. ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ చదివిన ఆయన కరీంనగర్లో మల్టీపర్పస్ లెక్చరర్గా బేసిక్ ట్రైనింగ్స్కూల్లో విధులు నిర్వహించారు. హుజూరాబాద్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా, వరంగల్ జిల్లా సంగెంలోని కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసి 1995లో ఉద్యోగ విరమణ పొందారు. ఆర్ఈసీలో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించారు. ఆయనకు భార్య కాత్యాయని, కుమారుడు రుద్రరాజు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
అభ్యుదయ రచయితగా పేరు..
శ్రీశ్రీ కవితలపై ఆకర్షితుడైన పోతరాజు.. కాళోజీ వద్ద శిష్యునిగా చేరి రచనలు చేయడం ప్రారంభించారు. 1958లో భారతి అనే పత్రిక మొదటిగా పోతరాజు రాసిన ‘గృహోన్ముఖి’ అనే కథను ప్రచురించింది. అనంతరం ‘పావురం’ నవలతో పోతరాజు రచయితగా ప్రస్థానం ప్రారంభించారు. మట్టిబొమ్మలు, గాజుకిటికీ, చివరిఅంచు, చితినెగళ్లు బహుళ ప్రాచుర్యం పొందాయి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమ మాసపత్రిక విద్యుల్లతలో ‘నా ఎర్రబుట్ట’ కథ కారణంగా పత్రికపై కేసు పెట్టి మూసివేయించగా.. పోతరాజుపై కేసు నమోదు చేశారు.
ఆయన వరంగల్ సెంట్రల్ జైల్లో ఎనిమిది నెలలు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి పోతరాజును బర్తరఫ్ చేశారు. న్యాయస్థానం ద్వారా తిరిగి ఉద్యోగాన్ని సాధించారు. ఆయన కథలు పలు భాషల్లో అనువాదమయ్యాయి. విరసం సభ్యుడిగా, పౌరహక్కుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. మావోయిస్టు పార్టీలో, ప్రజా ఉద్యమాల్లో పేరుగాంచిన పలువురు పోతరాజు వద్ద అక్షరాలు దిద్దినవారే. కాగా, పోతరాజు అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు కుమారుడు రుద్రరాజు తెలిపారు.
విప్లవ కవి పోతరాజు కన్నుమూత
Published Sat, Jan 10 2015 2:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు
బాస్కెట్బాల్ జాతీయ పోటీలకు ఏలూరు క్రీడాకారులు
టీడీపీ చింతలపూడి అభ్యర్థి సొంగాను ప్రాసిక్యూట్ చేయాలి
జగనన్న గెలుపులో భాగస్వాములవుదాం
లారీ ఢీకొని ఆటో డ్రైవర్ మృతి
ప్రశాంతంగా నీట్ పరీక్ష
వైఎస్సార్సీపీలోకివలసలవరద
రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు
కాకర్ల విజయం క్లిష్టమే..!
నోటుతో ఓటుకు ఎర
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement