► పవర్ ప్రాజెక్టు పనుల తీరుపై సింగరేణి సీఎండీ అసంతృప్తి
► మే వరకు 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం కావాలని ఆదేశం
► ఆకస్మికంగా సందర్శించిన సీఎండీ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. ముఖ్యంగా కొన్ని విభాగాల పనులు ఏళ్లు గడుస్తున్నా ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు. ఈ పనుల తీరుపై సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ) ఎన్.శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్లాంటు పనులను పరిశీలించారు. సుమారు మూడు గంటలపాటు అన్ని పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. యాష్హ్యాండ్లింగ్ ప్లాంటు, పంప్హౌజ్లను పరిశీలించారు. ఇక్కడ కొనసాగుతున్న పైప్లైన్ పనుల తీరుపై సీఎండీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పనులు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు.
యాష్పాండ్, బొగ్గు రవాణా, కన్వేయర్ బెల్ట్ తదితర పనుల పట్ల కూడా సీఎండీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఫ్లైయాష్ ప్లాంటు, కోల్హాప్పర్ ప్లాంట్లకు సంబంధించి కూలింగ్ టవర్ల నిర్మాణం పనులను కూడా ఆయన పరిశీలించారు. వీటి నిర్మాణం కోసం నిర్దేశిత కాల పరిమితిలో పనులు పూర్తి చేయని పక్షంలో సంబంధిత నిర్మాణ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సింగరేణి స్థానిక అధికారుల తీరుపై కూడా సీఎండీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పనులు సకాలంలో పూర్తి చేయని ఏజెన్సీల పట్ల కొందరు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అధికారులతో సమీక్ష..
అనంతరం నిర్మాణ ఏజెన్సీలతో పనులపై సమీక్ష నిర్వహించిన సీఎండీ మే నెలాఖరు వరకు రెండు ప్లాంట్ల పనులు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తెలంగాణ విద్యుత్ అవసరాల దృష్ట్యా ఈ ప్లాంటు నుంచి 1,200 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగించాలన్నారు. అవసరమైతే ఎక్కువ మంది సూపర్వైజర్లను, సిబ్బందిని, కార్మికులను నియమించుకోవాలని ఆదేశించారు. మొదటి యూనిట్ సింక్రనైజేషన్ విజయవంతంగా పూర్తి చేశామని, రెండో యూనిట్ కూడా సింక్రనైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి మే నెలాఖరు కల్లా రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలా చూడాలన్నారు.
సీఎండీ వెంట సింగరేణి డెరైక్టర్లు బి.రమేష్ కుమార్, ఎ.మనోహర్రావు, జె.పవిత్రన్ కుమార్, పి.రమేష్బాబు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సంజయసూర్, కోఆర్డినేషన్ జీఎం జె.నాగయ్య, సివిల్ జీఎం మురళీకృష్ణ, ఈఅండ్ఎం జీఎం సుధాకర్రెడ్డి, వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
నత్తనడక
Published Tue, Mar 29 2016 2:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement