మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.వేల కోట్ల ఖర్చు తో రోడ్ల నిర్మాణానికి పూనుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ల అనుసంధా నం జరుగుతోంది. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్లను పది కాలాల పాటు నిలిచేలా నాణ్యతతో నిర్మించాల్సి ఉండగా.. కాంట్రాక్ట ర్ల ధనదాహం, అధికారుల అవినీతి వల్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు పెద్దపల్లి కాల్వశ్రీరాంపూర్ డబుల్ రోడ్డు పనులే నిదర్శనం.
కరీంనగర్ : పెద్దపల్లి- కాల్వశ్రీరాంపూర్ డబుల్రోడ్డు పనులు నాసిరకంగా కొనసాగుతున్నాయి. తొలిదశగా రూ.10 కోట్లతో పెద్దపల్లి రైల్వే లెవల్ క్రాసింగ్ నుంచి రాంపల్లి వరకు కొనసాగుతున్న రోడ్డు పనుల్లో కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లు వదిలారు. గ్రావెల్ పనులు జరుగుతున్న సమయంలో ఆశించిన రీతిలో వాటర్ క్యూరింగ్ ముగించకుండానే నామమాత్రంగా నీల్లు పట్టి రోడ్డు పనులు పూర్తి చేశారు. ఇప్పుడు కంకర తేలి చెల్లాచెదురైన రోడ్డుపైనే బీటీ వేయడం వ ల్ల రోడ్డు మన్నిక ప్రశ్నార్థకంగా మారింది.
రోడ్డుకు ఇరువైపుల చివరలో కంకర పైనా బీటీ వేయడంతో బలంగా పట్టుకునే పరిస్థితులు లేవు. దీంతో కొన్ని నెలల్లోనే ఇరువైపుల చివర భాగాలు దెబ్బతిని దాని ప్రభావం డబుల్ రోడ్డుపై పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా కలలుకన్న డబుల్ రోడ్డు నిర్మాణం పనులను పర్యవేక్షించే ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ సైతం పనులు జరుగుతున్న సమయంలో అందుబాటులో ఉండడం లేదు. ఆర్ఆండ్బీ గ్యాంగ్మన్ మాత్రం ఒక్కరిద్దరు రోడ్డు వద్ద ఉండి సారు... ఇప్పుడే ఆఫీసుకు వెళ్లారని సమాధానం ఇస్తున్నారు.
ప్రస్తుతం రైల్వే లెవల్ క్రాసింగ్ నుంచి రాంపల్లి ఎల్లమ్మగుడి వరకు రూ.10 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. రాంపల్లి ఎల్లమ్మగుడి నుంచి కాల్వశ్రీరాంపూర్ వరకు మరో రూ.10 కోట్లతో టెండర్లు పిలిచారు. అవి కూడా వారం పదిరోజుల్లో పూర్తవుతాయని అంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న రోడ్డు పనుల్లో భాగంగా కల్వర్టుల నిర్మాణం సైతం నాసిరకంగా ఉంది. పాతకాలంలో నిర్మించిన పైపులైన్ కల్వర్టుకి ఇరువైపుల అతుకులు వేసి పై పై మెరుగులు దిద్దుతున్నారు. డబుల్ రోడ్డు నిర్మాణంతో వాహనాల రద్దీ పెరిగితే పాత కాలం నాటి పైపులైన్ కల్వర్టు దెబ్బతింటే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ల నుంచి అధికారులకు ముడుపులు ముట్టడం వల్లే నాణ్యత గురించి పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నారుు. ఎంతో కీలకమైన అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఇటువైపు తొంగిచూడకపోవడం విశేషం.
కూనారం రోడ్డు నాలుగులైన్ల ప్రతిపాదన
పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డును నాలుగులైన్ల రోడ్డుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పట్టణంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని హన్మంతుని పేట రైల్వే లెవల్ క్రాసింగ్ వరకు 100 ఫీట్ల వెడల్పుతో కూడిన నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కాగా, త్వరలోనే టెండర్లు పిలువన్నుట్లు సమాచారం.
నాణ్యతపై నిఘా
ఉంచుతున్నాం
పెద్దపల్లి-కాల్వశ్రీరాంపూర్ డబుల్రోడ్డు నిర్మాణ పనులపై నిఘా ఉంచామని పెద్దపల్లి ఆర్అండ్బీ డీఈఈ రాములు చెప్పారు. నాణ్యత విషయంలో ఎలాంటి అనుమానాలు వచ్చినా ఎప్పటికప్పుడు అనుమతించి పనులు చేయిస్తున్నామన్నారు. క్వాలిటీ అధికారుల నివేదికల తరువాతనే బిల్లులు చెల్లిస్తామన్నారు.
-డిఇఇ రాములు
నాణ్యత నగుబాటు
Published Fri, Apr 24 2015 1:47 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలీవాల్.. సీన్ రీ కన్స్ట్రక్షన్?
కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
సీరియల్లో హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన నటి.. ఫైన్ కట్టాల్సిందే!
మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం.. ఈడీ చరిత్రలో తొలిసారిగా
సంతోషంలో కావ్యా మారన్.. కేన్ విలియమ్సన్ను పలకరించి మరీ! (ఫొటోలు)
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
తప్పక చదవండి
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement