తూప్రాన్: మెదక్ జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. తూప్రాన్ డీఎస్పీ వేంకటేశ్వర్లు వివరాలు మీడియాకు వెల్లడించారు.
శివ్వంపేట మండలం పాంబండ గ్రామంలో ఈ నెల 2వ తేదీన ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. వారు గ్రామంలో పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్లగా అత్యాచారానికి పాల్పడిన ఇద్దరి యువకులకు రూ.లక్ష చొప్పున జరిమాన విధించారు.
దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ శివ్వంపేట పోలీసులను ఆశ్ర యించారు. దీంతో వారు కేసు నమోదు చేసుకుని నిందులను అరెస్టు చేశారు. కాగా, చట్టానికి వ్యతిరేకంగా జరిమానా ఇవ్వాలంటూ తీర్పునిచ్చిన గ్రామ సర్పంచ్తో పాటు 14 మంది గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వేంకటేశ్వర్లు తెలిపారు.