ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యాభివృద్ధికి పాటుపడాల్సిన ఆ శాఖ అధికారులు నిరుపేద చిన్నారులను బడికి దూరం చేస్తున్నారు. ఉన్న ఒక్క టీచర్ను.. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో వేరే మండలానికి పంపించి పాఠశాల మూతపడేలా చేశారని రాయికోడ్ మండల పరిధిలోని అల్లాపూర్వాసులు మండిపడ్డారు. ఇలాగైతే తమ పిల్లల బతుకులు ఏం కావాలని ప్రశ్నించారు.
- ‘వర్క్ అడ్జస్ట్మెంట్’తో మూతపడిన పాఠశాల
- ఉన్న ఒక్క టీచర్ని వేరే చోటకు పంపిన వైనం
- ఆందోళనలో అల్లాపూర్వాసులు
రాయికోడ్: ఉపాధ్యాయులు లేక, విద్యార్థుల సంఖ్యతగ్గిబోసిపోతున్న సర్కారీ బడులను బలోపేతం చేయాల్సిన విద్యాశాఖ అధికారులు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఇష్టానుసారంగా టీచర్లను ఇతర మండలాలకు పంపిస్తూ పేద విద్యార్థులను చదువు నుంచి దూరం చేస్తున్నారు. మండలంలోని అల్లాపూర్ ప్రాథమిక పాఠశాలే దీనికి నిదర్శనం. దీనిలో 1 నుంచి 5వ తరగతి వరకు 25 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఒకే టీచర్ ఉండటంతో.. గ్రామానికి చెందిన 40 మంది పిల్లలు ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన 25 మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు.
ఈ క్రమంలో స్కూల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయురాలు సంతోషను వర్క్ అడ్జస్ట్మెంట్పై పటాన్చెరు మండలం కిష్టారెడ్డిపేటకు పంపించారు. వంట మనిషి నాగమ్మ బుధవారం మధ్యాహ్న భోజనం వడ్డించిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు పాఠశాలకు తాళం వేశారు. ఉన్న ఒక్క టీచర్ను కూడా ఇతర పాఠశాలకు పంపించడంపై తల్లిదండ్రులు, స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నవాళ్లు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాల్లో చదివిస్తున్నారని.. కూలీనాలి చేసుకుని బతికే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. డీఈఓ కార్యాలయం నుంచి గత నెల 28న తమకు అందిన ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయురాలిని వర్క్ అడ్జస్ట్మెంట్పై పంపించామని ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు.
పాఠశాల మూతపడటం, వర్క్అడ్జస్ట్మెంట్ అంటే అర్థమేంటని..? జోగిపేట డిప్యూటీ ఈఓ పోమ్యానాయక్ను అడగగా.. టీచర్ను ఇతర మండలానికి పంపించినట్లు తనకు సమాచారం లేదని జవాబు దాటవేశారు. రాష్ట్ర స్థాయి నాయకులు, అధికారుల నుంచి వచ్చిన వత్తిడి మేరకే పాఠశాల మూత పడుతోందని తెలిసినా అధికారులు నోరు మెదపడం లేదని తెలిసింది. ఈ ఏడాది జూలై లోను మండల పరిధిలోని కర్చల్ పాఠశాల ఉపాధ్యాయరాలు స్వప్నను కూడా ఇదే రీతిలో లింగారెడ్డిపల్లి పాఠశాలకు పంపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు తమ పాఠశాలలో సిబ్బందిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.
సర్కార్ బడికి తాళం!
Published Thu, Dec 4 2014 12:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నగదు సీజ్
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
ఈవీఎంల కమిషనింగ్ పూర్తి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి
కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లు
ప్రజల గొంతుౖనై పోరాడా..
అంతకు మించి...
అటకెక్కిన కాంగ్రెస్ హామీలు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement