ప్రగతినగర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పథకం లబ్ధిదారులకు రెండవ రోజు కూడా చేదు అనుభవం మిగిల్చింది. జాబితాలో తమ పేర్లు లేవంటూ పలువురు ఆందోళనకు దిగారు. మరికొందరు పంచాయతీ, మండల కార్యాలయాలను ముట్టడించారు. సాంకేతిక కారణాలతోపాటు బ్యాంకుల నుంచి రూ. పది లక్షల పైబడి డబ్బులు డ్రా చేయని పరిస్థితి, సిబ్బంది కొరత తదితర కారణాలతో రెండవ రోజూ మొక్కుబడిగా పింఛన్ల పంపిణీ కొనసాగింది. నిజామాబాద్లోని వినాయక్నగర్ కమ్యూనిటీ హాలులో అసలు అధికారులే రాక పింఛన్దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోటగల్లి పద్మశాలి సంఘంలో పేర్లు ఉన్నవారికీ పింఛన్లు అందించలేకపోయారు. 50వ డివిజన్లో సాయంత్రం వరకు అదికారులు చేరుకోలేకపోయారు.
నిజామాబాద్ మండలంలో పలు గ్రామాల ప్రజలు గ్రామ పంచాయతీ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. పింఛన్ రానివారు ఆందోళనకు దిగారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో బాధితులు ధర్నా చేసి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. మామిడిపల్లి, అమ్రాద్ గ్రామస్తులు ఎంపీడీఓఓ వద్ద కార్యాలయం ధర్నా చేసారు. బాన్సువాడ నియోజకవర్గంలో వర్ని, కోటగిరి మండలం చిక్కడ్పల్లి గ్రామాలలో వృద్ధులు, సిరికొండ మండలంలో వృద్ధులు, వికలాంగులు ధర్నా నిర్వహించారు.
అర్హులందరికీ పింఛన్లు వచ్చే వరకు పంపిణీ చేయవద్దని సర్పంచ్ సాయన్నను, వీఆర్ఓను వెనక్కు పంపించి వేశారు. బోధన్ పట్టణంలో పోలీసు బందోబస్తు మధ్య ఫించన్ల పంపిణి జరిగింది. నవీపేట మండల కేంద్రంలో ఒక్కసారిగా లబ్ధిదారులు ఎగబడటంతో పరిస్థితి గందరగోళంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని క్యూ పద్ధతిలో కొనసాగించారు. కామారెడ్డి పట్టణంలో అర్హుల పేర్లు జాబితాలో లేవని బస్టాండ్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు.
రెండో రోజు ఇదీ పరిస్థితి
రెండవ రోజు అధికారులు పింఛన్లను మొక్కుబడిగా అందించారు. మొదటి రోజు కేవలం 21.157 మందికే పింఛన్లు అందాయి. గురువారం 60,007 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. రెండు రోజులలో 81,164 మంది లబ్ధిదారులకు 17.10 కోట్లు పంపిణి చేశారు.
రెండో రోజూ అంతంతే!
Published Fri, Dec 12 2014 3:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
ధోని జట్టులో అవసరమా?: ‘తలా’పై సంచలన వ్యాఖ్యలు
హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు
జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా
ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
గోదారిలో గాలి కబుర్లే..!
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement