రూ.5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
ఆటో యజమాని నుంచి లంచం డిమాండ్ చేసిన మాడ్గుల సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసు
మాడ్గుల : రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదం కేసులో ఓ ఆటో యజమాని నుంచి మాడ్గుల ఎస్ఐ శ్రీనివాసు రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా గురువారం ఏ సీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నా రు. ఏసీబీ డీఎస్పీ రాందాస్తేజ్ విలేకరు ల సమావేశంలో తెలిపిన వివరాల ప్ర కారం.. మాడ్గుల మండలం నాగిళ్లకు చెం దిన ఆటో యజమాని అనంతుల రాంజీ జూలై 14ననల్గొండ జిల్లా మాల్ నుంచి తన ఆటోలో వస్తూ మండలంలోని గుడితండా సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదం లో ముగ్గురికి గాయాలయ్యాయి.
బాధితుల ఫిర్యాదు మేరకు ఆటో యజమాని అనంతుల రాంజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాయాలైన ముగ్గురికి ఆటో యజమాని రాంజీ చికిత్స నిమిత్తం ఖర్చయిన డబ్బులతోపాటు నష్టపరిహారం కూడా చెల్లించాడు. అయినప్పటికీ ఈ కేసు విషయంలో ఎస్ఐ శ్రీనివాసు రాంజీని రూ.10 వేలు లంచం ఇవ్వాలని డిమాండు చేశాడు. దీంతో రాంజీ రూ.5 వేలు ఇస్తానని ఒప్పుకుని.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఎస్ఐ శ్రీనివాస్ తన గదిలో ఉండగా రాంజీ సాయంత్రం 5.30 గంటలకు గదివద్దకు చేరుకుని, ఎస్ఐకి రూ.5 వేలు ఇవ్వ జూపగా.. ఇంటిముందున్న మోటారు సైకిల్ కవరులో పెట్టమని సూచించాడు. దీంతో రాంజీ ఆరుబయట ఉన్న మోటారుసైకిలు కవరులో రూ.5 వేల నగదును పెట్టాడు. పక్కనే మాటు వేసిన ఉన్న ఏసీబీ అధికారులు ఎస్ఐ శ్రీనివాసుతోపాటు అతని మోటారుసైకిలును అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. మోటారు సైకిలు కవరులో రాంజీ పెట్టిన రూ.5 వేలతోపాటు మరో రూ.4వేలు పట్టుబడ్డాయి. అనంతరం ఏసీబీ అధికారులు ఎస్ శ్రీనివాసును విచారించారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తన సెల్: 94913 05609నంబర్కు ఫోన్ చేయాలని ఏసీబీ డీఎస్పీ రాందాసుతేజ్ సూచించారు. ఈ దాడిలో సీఐలు గోవింద్రెడ్డి, ప్రతాప్, నవీన్ పాల్గొన్నారు.
ఏసీబీ వలలో చిక్కిన ఎస్ఐ
Published Fri, Aug 7 2015 4:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement