సాక్షి, కొత్తగూడెం: వారసత్వ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ఐదు జాతీయ కార్మిక సం ఘాలు ఇచ్చిన పిలుపుతో సింగరేణిలో గురు వారం నుంచి ప్రారంభమైన సమ్మె తొలిరోజు ప్రశాంతంగా జరిగింది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో మొదటి షిఫ్టులో 39.85 శాతం కార్మికులు విధులకు హాజరుకాగా 60.15 శాతం కార్మికులు సమ్మెలో పాల్గొ న్నారు. సమ్మెతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడింది. సమ్మె సందర్భంగా పలు ప్రాంతాల్లో కార్మిక సం ఘాలు వారసత్వ ఉద్యోగాల అంశాన్ని సత్వరం పరిష్కరించాలని కోరుతూ ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాయి. మరోవైపు సింగరేణిలో తొలిరోజు సమ్మె ప్రభావంపై స్పందించిన సింగరేణి యాజ మాన్యం కార్మి కులను తక్షణం సమ్మె విర మించి విధుల్లో చేరా లని విజ్ఞప్తి చేసింది.
కార్మికులు అధికశాతంలో సమ్మెలో పాల్గొన్న పటికీ బొగ్గు ఉత్పత్తి మాత్రం 98 శాతం జరిగినట్లు అధికారులు లెక్కలు చెప్తున్నారు. 11 ఏరియాల్లో అత్య ధికంగా కార్పొరేట్ ఏరి యాలో 92.33 శాతం కార్మికులు హాజరు కాగా, అత్యల్పంగా అడ్రి యాల ప్రాజెక్టులో 24.10 శాతం కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి ప్రధాన కార్యాలయం తోపాటు అన్ని ఏరియా ల్లోనూ గనులు, డిపార్ట్మెంట్ల వద్ద పోలీ సులు, స్పెషల్పార్టీ సిబ్బందితో భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు.
గనులకు వెళ్లే ప్రతీ ఒక్కరి వద్ద గుర్తింపు కార్డులను పరిశీలించి అనుమతిం చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియాలో సమ్మె ప్రభావాన్ని డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్ పరిశీలిం చారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట జాతీయ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిం చారు. 1981 ఒప్పందం ప్రకారం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించే వరకు కార్మికులు సమ్మెలో పాల్గొనాలని నాయకులు కోరారు. సమ్మెకు స్థానిక కార్మిక సంఘాలు మద్దతు తెలపగా, టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సమ్మెకు దూరంగా ఉంది.
వారసత్వ ఉద్యోగాల సాధన కోసం..
గోదావరిఖని: సింగరేణిలో వారసత్వ ఉద్యో గాల సాధన కోసం కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపునకు కార్మికులు స్పందించారని, మెజార్టీ కార్మికులు విధులకు హాజరు కాకుండా తమ ఆకాంక్షను వ్యక్తం చేసి విజయ వంతం చేశారని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ బి.జనక్ప్రసాద్ తెలిపారు. సమ్మె నేపథ్యంలో ఆయన గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విలేకరులతో మాట్లాడారు.
సింగరేణిలో సమ్మె సక్సెస్..
Published Fri, Jun 16 2017 1:27 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement