ఆర్టీసీ బస్సు ఢీ: విద్యార్థినికి గాయాలు | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీ: విద్యార్థినికి గాయాలు

Published Thu, Nov 19 2015 8:06 PM

Student injured in Road accident

కోనరావుపేట (కరీంనగర్) : ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఆదర్శ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న అఖిల కుమారి(13) రోడ్డు దాటుతున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు విద్యార్థినిని సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement