బాలిక అదృశ్యం | Sakshi
Sakshi News home page

బాలిక అదృశ్యం

Published Sat, Jun 6 2015 8:21 PM

Teenage girl missing

కాటేదాన్ (హైదరాబాద్) : కంపెనీకి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరిన ఓ బాలిక అదృశ్యమైంది. ఈ ఘటన హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన టక్రీ సంతోష్ అనే వ్యక్తి కుటుంబసభ్యులతో కలసి కాటేదాన్ మధుబన్‌కాలనీలో నివసిస్తూ స్థానిక పారిశ్రామికవాడలో కూలీలుగా పని చేస్తున్నారు. సంతోష్ కుమార్తె టాక్రీ మౌనిక(16) రూబీ చాక్లెట్ కంపెనీలో పనిచేస్తోంది. కాగా ఆమె ఈ నెల 4 వ తేదీన కంపెనీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వాకబు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement