బావే చంపేశాడని పోలీసుల నిర్ధారణ..?
త్వరలో వివరాల వెల్లడి
దోమ/పరిగి : దోమ మండల పరిధిలోని తిమ్మాయపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న బాలిక అనుమానాస్పద మృతి కే సులో పోలీసులు పురోగతి సాధించారు. గ్రామానికి చెందిన సుగుణమ్మ(15) గత సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితి లో దూలానికి ఉరి వేసుకొని మృతి చెం దిన విషయం తెలిసిందే. మృతురాలి కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రా రంభించారు.అయితే మృతురాలి కు టుంబ సభ్యులు గతంలో ఓ కేసు విషయంలో నిందితులుగా ఉండడంతో బా లిక హత్యకు పాత కక్షలే కారణమై ఉం టాయని అందరూ భావించారు.
ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడాఅనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యా ప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ లో భాగంగా బాలిక హత్యకు గురైం దని నిర్ధారించి పాత కక్షలు కాదని గుర్తించా రు.బాలిక సోమవారం ఎక్కడికి వెళ్లింది, ఎవరితో వెళ్లిందనే కోణంలో విచారణ జరిపారు. బాలిక రోజంతా బావ వరుసయ్యే ఓ యువకుడితో కలి సుందని గుర్తించారని పోలీసులు గుర్తించారు.
మరొకరితో మాట్లాడిందని హత్య..
బాలిక సుగుణమ్మ 7వ తరగతి వరకు చదివింది. పరిస్థితుల అనుకూలించకపోవడంతో ఏడాది క్రితం చదువు మానేసి ఇంటివద్ద ఉంటూ పొలం పనులకు వెళ్లింది. అనంతరం తెలిసిన వారి సాయంతో హైదరాబాద్లో ఓ ఇంట్లో పని చేసేందుకు వెళ్లింది. ఈక్రమంలోనే స్వగ్రామం తిమ్మాయిపల్లికి చెందిన వరుసకు బావ అయిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడిందని సమాచారం. బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్న యువకుడు ఆమెను తరచూ కలుస్తుండేవాడు. ఈనేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చిన బాలిక తల్లిని, కుటుంబీకులను కలవలేదు. నేరుగా బావ అయిన యువకుడి దగ్గరకు వెళ్లిందని సమాచారం.
రాత్రి వరకు వారిద్దరు పొలం వద్దే ఉన్నారు. ఆ సమయంలోనే బాలిక యువకుడి ఫోన్తో మరొకరితో మాట్లాడడంతో అతడికి బాలికపై అనుమానం ఏర్పడింది. రాత్రి 10 గంటలకు ఇద్దరూ గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే బాలిక తల్లి ఇంటికి తాళం వేసి అదే గ్రామంలో ఉండే తన చెల్లెలు ఇంటికి వెళ్లి నిద్రించింది. దీంతో బాలిక, యువకుడు ఇంటిపైకి ఎక్కి బండలు తొలగించి లోపలికి దిగారు. ఫోన్లో ఎవరితో మాట్లాడావని యువకుడు బాలికను నిలదీయగా సమాధానం చెప్పలేదు. దీంతో అతడు గొంతు నులిమి హత్యచేసి అనంతరం చున్నీతో దూలానికి ఉరివేసి వచ్చినదారినే వెళ్లి పోయాడు. పోలీసులు అనుమానంతో యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా నేరం అంగీకరించినట్లు సమాచారం. త్వరలో పోలీసులు విలేకరుల సమావేశంలో అన్ని వివరాలు వెల్లడించనున్నారు.
బాలికది హత్యే!
Published Fri, Aug 28 2015 2:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement