బాలికది హత్యే! | Sakshi
Sakshi News home page

బాలికది హత్యే!

Published Fri, Aug 28 2015 2:32 AM

The murder of the girl!

బావే చంపేశాడని పోలీసుల నిర్ధారణ..?  
త్వరలో వివరాల వెల్లడి
 
 దోమ/పరిగి : దోమ మండల పరిధిలోని తిమ్మాయపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న బాలిక అనుమానాస్పద మృతి కే సులో పోలీసులు పురోగతి సాధించారు. గ్రామానికి చెందిన సుగుణమ్మ(15) గత సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితి లో దూలానికి ఉరి వేసుకొని మృతి చెం దిన విషయం తెలిసిందే. మృతురాలి కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రా రంభించారు.అయితే మృతురాలి కు టుంబ సభ్యులు గతంలో ఓ కేసు విషయంలో నిందితులుగా ఉండడంతో బా లిక హత్యకు పాత కక్షలే కారణమై ఉం టాయని అందరూ భావించారు.

ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడాఅనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యా ప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ లో భాగంగా బాలిక హత్యకు గురైం దని నిర్ధారించి పాత కక్షలు కాదని గుర్తించా రు.బాలిక సోమవారం ఎక్కడికి వెళ్లింది, ఎవరితో వెళ్లిందనే కోణంలో విచారణ జరిపారు. బాలిక రోజంతా బావ వరుసయ్యే ఓ యువకుడితో కలి సుందని గుర్తించారని పోలీసులు గుర్తించారు.  

 మరొకరితో మాట్లాడిందని హత్య..  
 బాలిక సుగుణమ్మ 7వ తరగతి వరకు చదివింది. పరిస్థితుల అనుకూలించకపోవడంతో ఏడాది క్రితం చదువు మానేసి ఇంటివద్ద ఉంటూ పొలం పనులకు వెళ్లింది. అనంతరం తెలిసిన వారి సాయంతో హైదరాబాద్‌లో ఓ ఇంట్లో పని చేసేందుకు వెళ్లింది. ఈక్రమంలోనే స్వగ్రామం తిమ్మాయిపల్లికి చెందిన వరుసకు బావ అయిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడిందని సమాచారం. బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్న యువకుడు ఆమెను తరచూ కలుస్తుండేవాడు. ఈనేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చిన బాలిక తల్లిని, కుటుంబీకులను కలవలేదు. నేరుగా బావ అయిన యువకుడి దగ్గరకు వెళ్లిందని సమాచారం.

రాత్రి వరకు వారిద్దరు పొలం వద్దే ఉన్నారు. ఆ సమయంలోనే బాలిక యువకుడి ఫోన్‌తో మరొకరితో మాట్లాడడంతో అతడికి బాలికపై అనుమానం ఏర్పడింది. రాత్రి 10 గంటలకు ఇద్దరూ గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే బాలిక తల్లి ఇంటికి తాళం వేసి అదే గ్రామంలో ఉండే తన చెల్లెలు ఇంటికి వెళ్లి నిద్రించింది. దీంతో బాలిక, యువకుడు ఇంటిపైకి ఎక్కి బండలు తొలగించి లోపలికి దిగారు. ఫోన్‌లో ఎవరితో మాట్లాడావని యువకుడు బాలికను నిలదీయగా సమాధానం చెప్పలేదు. దీంతో అతడు గొంతు నులిమి హత్యచేసి అనంతరం చున్నీతో దూలానికి ఉరివేసి వచ్చినదారినే వెళ్లి పోయాడు. పోలీసులు అనుమానంతో యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా నేరం అంగీకరించినట్లు సమాచారం. త్వరలో పోలీసులు విలేకరుల సమావేశంలో అన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Advertisement
Advertisement