విమాన ప్రయాణికుల కోసం సరికొత్త యాప్ | Sakshi
Sakshi News home page

విమాన ప్రయాణికుల కోసం సరికొత్త యాప్

Published Thu, Feb 4 2016 1:15 AM

The new App for flight passengers

శంషాబాద్: విమానంలో ప్రయాణం బోర్ కొట్టకుండా.. ప్రయాణికులకు వినోదం అందించడానికి శంషాబాద్ విమానాశ్రయం అధికారులు బుధవారం ఓ కొత్త యాప్‌ను ప్రారంభించారు. ఫ్రాప్‌కార్న్ సంస్థతో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ యాప్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌లో చెకి ంగ్ పూర్తి చేసిన తర్వాత వైఫై ద్వారా ఫ్రాఫ్‌కార్న్ పేరిట ఉన్న యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సరి కొత్త సినిమాలు, ఇతర వినోదాత్మకమైన వీడియోలు మూడు నిమిషాల వ్యవధిలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ యాప్ ప్రయాణికులకు సరికొత్త అనుభూతి అందిస్తుందని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ సీఈఓ ఎస్‌జీకే కిషోర్ తెలిపారు. భవిష్యత్తులో ఈ సౌకర్యాన్ని విమానాశ్రయంలోని అన్ని టెర్మినళ్లకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయోగాత్మకంగా ఈ యాప్ సౌకర్యాన్ని అందిస్తున్నామని ఫ్రాప్‌కార్న్ సహాయ వ్యవస్థాపకుడు భన్సాల్ తెలిపారు. దేశంలోనే ఇలాంటి సౌకర్యం తొలిసారిగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.

Advertisement
Advertisement