‘సెయైంట్’ డిజిటల్ సెంటర్ల ప్రారంభోత్సవంలో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలను విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు సూచించారు. ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధిలో మరిన్ని సంస్థలు పాలుపంచుకోవాలని, రాష్ట్రాభివృద్ధిలోనూ తమ వంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. సెయైంట్ సాఫ్ట్వేర్ సంస్థ రజతోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని 54 పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. సోమవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వాటిని కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 25 ఏళ్ల కిందట వచ్చిన ఆలోచనే ప్రస్తుతం సెయైంట్ వంటి సంస్థ ఏర్పడటానికి కారణమైందన్నారు. ఒక వ్యక్తి తలచుకుంటే ఎంతో మందికి స్ఫూర్తిని ఇవ్వగలుగుతారని... సుందర్ పిచాయ్, సత్య నాదేళ్ల వంటి భారతీయులు అసాధారణ తెలివితేటలతో ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలకు నాయకత్వం వహిస్తూ స్ఫూర్తిగా నిలవడానికి చదువే కారణమన్నారు. అందుకే విద్యార్థులంతా శ్రద్ధగా చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం తరువాత ప్రస్తుతం డిజిటల్ విప్లవం అద్భుతాలు సృష్టిస్తోందన్నారు. సెయైంట్ తరహాలోనే ఇతర కార్పొరేట్ సంస్థలూ ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకారం అందిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
54 స్కూళ్లలో డిజిటల్ లిటరసీ సెంటర్లు
రాష్ట్రంలో ఐటీ పాలసీకి ఆకర్షితులై ఎన్నో అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్కు వస్తున్నాయని సెయైంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద గతంలో తాము 16 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించామని, తద్వారా ఆ పాఠశాలల్లో బాలికల ఎన్రోల్మెంట్, ఉత్తీర్ణత శాతం పెరిగి డ్రాపవుట్ల శాతం తగ్గిందన్నారు. ప్రస్తుతం 54 ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల్లో డిజిటల్ లిటరసీ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖర్ మాట్లాడుతూ హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ ఇప్పుడు దేశంలో కీలకంగా మారడానికి తెలంగాణ ప్రభుత్వం, కే టీఆర్ కృషే కారణమన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.
చదువంటే ప్రభుత్వ స్కూళ్లు అనేలా చేయడమే లక్ష్యం: ఈటల
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చి నిధులు ఖర్చు చేస్తోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజాసమస్యలను పరిష్కరించడంతోపాటు సమాజంలో అసమానతలు లేకుండా చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. చదువంటే శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థల్లోనే కాదని.. చదువంటే జిల్లా పరిషత్, ప్రభుత్వ స్కూళ్లు అనేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాను, కేటీఆర్ ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకున్నామన్నారు. రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సుమారు రూ. 180 కోట్లు వెచ్చించి రంగారెడ్డి జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి, విద్యాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.
రాష్ట్రాభివృద్ధికి కార్పొరేట్లు తోడ్పడాలి
Published Tue, Aug 30 2016 1:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement