-
చేనేత రంగానికి తగిన ప్రాధాన్యత
- 2022 నాటికి అందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు: దత్తాత్రేయ - సంక్షేమ రంగానికే ఎక్కువ నిధులు: ఈటల సాక్షి, హైదరాబాద్: చేనేత రంగానికి కేంద్రం తగిన ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. అందులో భాగంగానే చేనేత కార్మికులకు డబుల్ బెడ్రూం ఇళ్లు, తక్కువ వడ్డీకి రుణాలు, నిరుద్యోగులు పరిశ్రమలు నెలకొల్పేందుకు రూ.కోటి వరకు రుణాలను కేంద్రం అందజేస్తుందన్నారు. హైదరాబాద్లోని నాగోల్లో ఆదివారం జరిగిన పద్మశాలి చైతన్య సభలో ఆయన పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో దత్తాత్రేయ మాట్లాడుతూ.. చేతివృత్తుల వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. 2022 నాటికి దేశంలో అందరికీ ఇళ్లు కట్టించే లక్ష్యంతో మోదీ పనిచేస్తున్నారన్నారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ..2017–18 బడ్జెట్లో సంక్షేమ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించామన్నారు. అందులో భాగంగానే చేనేత రంగానికి రూ.12 వందల కోట్ల రూపాయలు కేటాయించినట్లు పేర్కొన్నారు. బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పద్మశాలీలు ఐక్యంగా ఉండి అన్ని పార్టీలనుంచి అధిక స్థానాల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీహెచ్ ప్రభాకర్, మాజీ ఎంపీ గుండు సుధారాణి, గుర్రం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాభివృద్ధికి కార్పొరేట్లు తోడ్పడాలి
‘సెయైంట్’ డిజిటల్ సెంటర్ల ప్రారంభోత్సవంలో కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలను విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు సూచించారు. ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధిలో మరిన్ని సంస్థలు పాలుపంచుకోవాలని, రాష్ట్రాభివృద్ధిలోనూ తమ వంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. సెయైంట్ సాఫ్ట్వేర్ సంస్థ రజతోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని 54 పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. సోమవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వాటిని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 25 ఏళ్ల కిందట వచ్చిన ఆలోచనే ప్రస్తుతం సెయైంట్ వంటి సంస్థ ఏర్పడటానికి కారణమైందన్నారు. ఒక వ్యక్తి తలచుకుంటే ఎంతో మందికి స్ఫూర్తిని ఇవ్వగలుగుతారని... సుందర్ పిచాయ్, సత్య నాదేళ్ల వంటి భారతీయులు అసాధారణ తెలివితేటలతో ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలకు నాయకత్వం వహిస్తూ స్ఫూర్తిగా నిలవడానికి చదువే కారణమన్నారు. అందుకే విద్యార్థులంతా శ్రద్ధగా చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం తరువాత ప్రస్తుతం డిజిటల్ విప్లవం అద్భుతాలు సృష్టిస్తోందన్నారు. సెయైంట్ తరహాలోనే ఇతర కార్పొరేట్ సంస్థలూ ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకారం అందిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 54 స్కూళ్లలో డిజిటల్ లిటరసీ సెంటర్లు రాష్ట్రంలో ఐటీ పాలసీకి ఆకర్షితులై ఎన్నో అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్కు వస్తున్నాయని సెయైంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద గతంలో తాము 16 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించామని, తద్వారా ఆ పాఠశాలల్లో బాలికల ఎన్రోల్మెంట్, ఉత్తీర్ణత శాతం పెరిగి డ్రాపవుట్ల శాతం తగ్గిందన్నారు. ప్రస్తుతం 54 ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల్లో డిజిటల్ లిటరసీ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖర్ మాట్లాడుతూ హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ ఇప్పుడు దేశంలో కీలకంగా మారడానికి తెలంగాణ ప్రభుత్వం, కే టీఆర్ కృషే కారణమన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. చదువంటే ప్రభుత్వ స్కూళ్లు అనేలా చేయడమే లక్ష్యం: ఈటల తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చి నిధులు ఖర్చు చేస్తోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజాసమస్యలను పరిష్కరించడంతోపాటు సమాజంలో అసమానతలు లేకుండా చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. చదువంటే శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థల్లోనే కాదని.. చదువంటే జిల్లా పరిషత్, ప్రభుత్వ స్కూళ్లు అనేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాను, కేటీఆర్ ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకున్నామన్నారు. రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సుమారు రూ. 180 కోట్లు వెచ్చించి రంగారెడ్డి జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి, విద్యాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. -
మంత్రి ఈటల రాజీనామా చేయాలి
చల్లూరు బాధితురాలికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్మాదిగ కరీంనగర్ : వీణవంక మండలం చల్లూరు దళిత యువతిపై అత్యాచార ఘటనకు నైతిక బాధ్యత వహించి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్మాదిగ కోరారు. అంబేద్కర్ భవన్లో గురువారం నిర్వహించిన ఎంఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లారు. నిందితులను రక్షించేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే పోలీసులు కేసును సీరియస్గా తీసుకోవడం లేదన్నారు. గ్యాంగ్రేప్ బాధితురాలికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జి బొర్ర భిక్షపతి, నగర అధ్యక్షుడు గోష్కి అజయ్, జిల్లా అధ్యక్షుడు మాతంగి మహేశ్, నాయకులు అనిల్, ప్రశాంత్, అజయ్, బోయిని శశి, ప్రవీణ్, హరికృష్ణ, ఉదయ్, రాజేశ్, లావణ్య, లక్ష్మణ్, వర్మ తదితరులు పాల్గొన్నారు.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- ఆహార ప్రియులకు అలర్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు
- ఢిల్లీలో తగ్గిన పోలింగ్ శాతం
- ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
- నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
- స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
- T20 World Cup 2024: సెమీస్కు చేరే జట్లు ఇవే..!
- పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
- కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
- రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్న కళానిధిమారన్
- ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
Advertisement