ట్రాక్టర్, బైక్ ఢీ: ఇద్దరు దుర్మరణం | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్, బైక్ ఢీ: ఇద్దరు దుర్మరణం

Published Tue, Dec 8 2015 6:54 PM

Two die in road accident

బోనకల్ : ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలకోట బ్రిడ్జి వద్ద ఓ ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మంగళారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కలకోట గ్రామానికి చెందిన చర్చి పాస్టర్ వెంగళ పుల్లయ్య (48), సిరిపురం గ్రామానికి చెందిన చావా కృష్ణప్రసాద్ (24)లు ఒకే బైక్‌పై మధిర వైపు వెళుతున్నారు. కలకోట బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చి ఢీకొన్నారు. దీంతో తీవ్ర గాయాలతో వారిద్దరూ ప్రమాద స్థలంలోనే మృతి చెందారు.

Advertisement
Advertisement