ట్రావెల్స్ బస్సు- ఢీసీఎం ఢీ: ఇద్దరు మృతి | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్ బస్సు- ఢీసీఎం ఢీ: ఇద్దరు మృతి

Published Sun, Nov 30 2014 5:23 AM

two killed, 14 were injured in road accident at hayat nagar

హైదరాబాద్: హయత్నగర్ మండలం వద్ద అంబర్పేట్లో ఆదివారం తెల్లవారుజామున  రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రైవేటు ట్రావెల్ బస్సు డ్రైవర్, క్లీనర్ మృతిచెందగా,  మరో 14మందికి తీవ్రగాయాలయ్యాయి.

విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్న ప్రియాంక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఏపీ 10v 2255) ఎదురుగా వస్తున్న ఢీసీఎంను ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. తీవ్రగాయాలైన వారి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement
Advertisement