'మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు' | Sakshi
Sakshi News home page

'మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు'

Published Fri, Jan 16 2015 7:57 PM

'మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు' - Sakshi

హైదరాబాద్: త్వరలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరనున్నారని మంత్రులతో తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు, పాతవారితో కలిసి పనిచేయాలని సూచించినట్టు తెలిసింది.  కష్టపడేవారికి పదవులు ఇస్తామని కూడా చెప్పినట్టు సమాచారం

ఏప్రిల్ 25, 26 తేదీల్లో టీఆర్ఎస్  ప్లీనరీ, 27న బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నారు.  ఏప్రిల్ 1లోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలనుకుంటున్నట్టు భావిస్తున్నారు. కాగా, వచ్చే వారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తానని వెల్లడించినట్టు తెలిసింది. కరెంట్ కష్టాలను త్వరలో అదిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేసినట్టు సమాచారం.

Advertisement
Advertisement