వాహనం ఢీకొని మహిళ మృతి | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని మహిళ మృతి

Published Sat, Oct 10 2015 7:19 PM

Unidentified woman killed in road accident in rangareddy district

గచ్చిబౌలి (రంగారెడ్డి): కారు ఢీ కొట్టడంతో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. శనివారం తెల్లవారుజామున గచ్చిబౌలిలోని హుందాయ్ షోరూం వద్ద రోడ్డు దాటుతున్న మహిళ(45)ను గచ్చిబౌలి వైపు నుంచి వచ్చిన ఓ కారు ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement