‘అర్బన్ ఫైనాన్స్’ వర్క్షాప్లో మంత్రి ఈటెల
హైదరాబాద్: నగరాలతోపాటు పల్లెలు, పట్టణాలను సమాంతరంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖల మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. నగరంలో త్వరలో జరుగనున్న మెట్రో పొలిస్ సదస్సు సన్నాహకాల్లో భాగంగా సోమవారం ఇక్కడి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)లో ‘అర్బన్ ఫైనాన్స్’ అంశంపై జరిగిన ప్రీ-కాన్ఫరెన్స్ వర్క్షాప్లో ఆయన కీలకోపన్యాసం చేశారు. నగరాలు, పల్లెలు రెంటికీ ప్రాధాన్యమిస్తూ మానవీయ కోణంలో చేపట్టే చర్యలపై మెట్రోపొలిస్ సదస్సులో ఫోకస్ చేయాలని కోరారు. అభివృద్ధి కంటే భద్రత, ఉపాధి కల్పన తదితర అంశాలు కూడా ముఖ్యమేనన్నారు. నగరీకరణ అనివార్యంగా పెరుగుతోందని, నగర వాసుల జీవితం యాంత్రికంగా మారి మానవ సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు, నిబంధనలు వ్యక్తులు, హోదాలను బట్టి కాకుండా అందరికీ ఒకేవిధంగా పక డ్బందీగా అమలు కావాలని అభిలషించారు. ప్రభుత్వాలు మారినా శాస్త్రీయంగా చేపట్టిన పథకాలు మారరాదని సూచించారు.
మన్నికే ప్రధానం: తాగునీటి లైన్లు, డ్రెయినేజీల ఏర్పాటు వంటి ఏపనికైనా నాణ్యత పాటించకుంటే ఎన్ని నిధులు వెచ్చించినా నిష్ర్పయోజనమేనని మంత్రి తెలిపారు. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు, ఫుట్పాత్లను ఇందుకు ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. ప్రజలు నగరాల వైపు ఉపాధి కోసం చూసే ధోరణి మారాలంటే పల్లెలు, పట్టణాలు కూడా అభివృద్ధి చెందాలని అన్నారు. మెట్రోపొలిస్ సదస్సు నిర్వహించే అవకాశం ఆసియా దేశాల్లో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రావడం గర్వకారణమన్నారు. సదస్సు కోసం ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా పనులు చేస్తున్నాయన్నారు. సమావేశంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి, సీజీజీ డెరైక్టర్ జనరల్ కె. రామకృష్ణారావు, అడిషనల్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ గంగయ్య, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్, స్పెషల్ కమిషనర్ అహ్మద్బాబు తదితరులు పాల్గొన్నారు.
‘రేషన్’పై నేడు కేబినెట్ సబ్కమిటీ భేటీ
అర్హులైన పేదలందరికీ రేషన్కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఈటెల స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం సమావేశమై సీఎంకు నివేదిక అందజేస్తుందన్నారు. ప్రస్తుతం రూపా యికి కిలో చొప్పున కుటుంబానికి ఇస్తున్న 30 కిలోల బియ్యాన్ని 35 కిలోలకు పెంచే విషయం పరిశీలనలో ఉందన్నారు. సాధ్యాసాధ్యాలు బేరీజు వేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.
పల్లెలు, పట్టణాలనూ అభివృద్ధి చేయాలి
Published Tue, Sep 30 2014 12:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement