-
సీఎస్టీ బకాయిలు వెంటనే చెల్లించండి
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి ఈటల రాజేందర్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: రాష్ట్రానికి రావాల్సిన సీఎస్టీ బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీకి వచ్చిన ఈటల టీఆర్ఎస్ ఎంపీ వినోద్కుమార్, ఢి ల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్తో కలసి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లను వారి కార్యాలయాల్లో కలిశారు. అనంతరం నార్త్బ్లాక్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ఆడపడుచులకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్, పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి ఓ లేఖ రాశారు. దానిలో చేసిన విజ్ఞప్తి మేరకు 20 లక్షల గ్యాస్ కనెక్షన్లను వచ్చే రెండేళ్లలో ఇవ్వాలని ధర్మేంద్ర ప్రధాన్ను కోరాం’ అని ఈటల తెలిపారు. అదేవిధ ంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశంలో రాష్ట్రానికి కేంద్ర నుంచి రావాల్సిన రూ.6,600 కోట్ల సీఎస్టీ బకాయిలను విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు. ఎంపీ వినోద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న స్మార్ట్ సిటీల్లో రాష్ట్రంలో రెండు పట్టణాలను గుర్తించనున్నట్టు వార్తలు వస్తున్నాయని, అయితే ఐదు పట్టణాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులను కోరినట్టు చెప్పారు. పట్టణాభివృద్ధిశాఖ అధికారులను రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున ఆహ్వానించినట్టు తెలిపారు. -
నేడు సీఎం కేసీఆర్ రాక
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని లింగవారివారిగూడెంలో ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తల్లి కమలమ్మ దశదినకర్మ జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హాజరుకానున్నారు. కార్యక్రమంలో సీఎంతోపాటు రాష్ట్రమంత్రులు ఈటెల రాజేందర్, హరీష్రావు, గుంతకండ్ల జగదీష్రెడ్డి, మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలు కూడా పాల్గొంటారు. -
బడ్జెట్లో మాకూ చోటివ్వండి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి నిధులను కేటాయించాలని తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు గంధం అంజన్న కోరారు. రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ను కలసి వినతిపత్రం సమర్పించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1.25 లక్షల మంది ఉన్న భవన కార్మికులు సొంత గూడు లేక గుడిసెల్లో, అద్దె ఇళ్లలో నివాసముంటున్నారని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులందరికీ 120 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. అనారోగ్య సమస్యలు, ప్రమాదవశాత్తు ఎంతో మంది కార్మికులు మరణిస్తున్నారని అందుకే వారి ఆరోగ్యరీత్యా ఆరోగ్య కార్డులు కేటాయించాలని కోరారు. -
తెలంగాణ వచ్చిందన్న సంతోషమే లేదు
ప్రకృతి సహకరించకే ఈ కష్టాలు కరెంటును కొనుగోలు చేస్తే రాదు టీడీపీ శవరాజకీయాలు తగవు ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాబాద్: వర్షాభావం.. కరెంటు కొరతతో తెలంగాణ సాధించుకున్న సంతోషం కనిపిం చడం లేదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఈ కష్టాలకు ప్రకృతి సహకరించకపోవడమే కారణమన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శివారులోని కేసీ క్యాంపులో 220 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్ల్లోనే కాకుండా ఈసారి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో నూ కరువు నెలకొందని ఆవేదన చెందారు. దీనిని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు రాజకీ యం చేస్తున్నారని మండిపడ్డారు. శవరాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. కరెంటు కొంటే వస్తుందా..? కరెంటును కొనుగోలు చేయాలని అర్థం లేకుండా విమర్శలు చేయడం అనాలోచితమని ఈటెల అన్నారు. కొనుగోలు చేసినంత మాత్రాన అక్కడి నుంచి ఇక్కడకు లైన్లు ఉండొద్దా? అని ప్రశ్నించారు. ఆంధ్ర పాలకులు ఆ లైన్లన్నీ వారివైపే వేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణకు 6,700 మెగావాట్ల విద్యుత్ అవసరముండగా, 4వేల పైచిలుకు మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే ఉందన్నారు. డిసెంబర్లో శంకుస్థాపన కరీంనగర్ జిల్లా రామగుండంలో 1,300 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు డిసెంబర్ మొదటి వారంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నామని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కూడా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈటెల సభపై తేనెటీగల దాడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ శివారు కేసీ క్యాంపులో మంగళవారం మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్న ఓ సభపై తేనెటీగలు దాడి చేశాయి. ఇక్కడ మంత్రి 220 కేవీ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. అనంత రం మంత్రి మాట్లాడుతుండగా పక్కనే ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా ఈటెల, కలెక్టర్ వీరబ్రహ్మయ్యను చుట్టుముట్టాయి. పోలీసులు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది టవల్స్ తెచ్చి వారిపై రక్షణగా కప్పారు. పావుగంట అనంతరం మళ్లీ సభను కొనసాగించారు. -
నెలాఖరులో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్: రాష్ర్ట బడ్జెట్ సమావేశాలను ఈ నెలాఖరులో నిర్వహించడానికి సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు కసరత్తును దాదాపు పూర్తి చేశారు. బడ్జెట్ సమావేశాల కోసం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం సాయంత్రం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు రూ. 80 వే ల కోట్ల మేరకు బడ్జెట్ ఉంటుందని అంచనా. జూన్ 2 నుంచే బడ్జెట్ ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే జూన్ నుంచి అక్టోబర్ వరకు అయిన ఖర్చుతోపాటు నవంబర్ నుంచి మార్చి వరకు చేయాల్సిన వ్యయానికి సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదం పొందనుంది. సమావేశాలు 20 రోజులు జరిగే అవకాశమున్నట్లు సమాచారం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
వివాహితపై అత్తింటివారి దాడి
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
వేడుకునేది ఓటర్ని కాదు! సూర్యుడ్ని!!
సాంఘిక విప్లవ నాయకుడు
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను: సుహాస్
జాలీ రైడ్
తప్పక చదవండి
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
Advertisement